ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా నేడు మరో ఆసక్తికర పోరు జరగబోతోంది. ప్రస్తుతం లీగ్ దశ ముగింపుకు చేరుకున్న నేపథ్యంలో ప్రతి మ్యాచ్ కూడా ఆసక్తికరంగా మారింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగగా ఎంతో అలవోకగా విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్ లో అడుగుపెట్టిన మూడవ జట్టుగా రికార్డు సృష్టించింది.  కాగా నేడు ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది.


 అయితే ఇప్పటికే ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కారణంగా ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మాత్రం ప్లే ఆఫ్ లో అవకాశాలు దక్కించుకోవడానికి ఆశగా ఎదురుచూస్తుంది. కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే నేడు ముంబై ఇండియన్స్ పై జరిగే మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించింది అంటే ఇక వెనక్కి తిరిగి చూడకుండా ప్లే ఆప్ లో అడుగుపెడుతుంది. ప్రస్తుతం  పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐదవ స్థానంలో కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే.


 ఇక మరోవైపు అటు నాలుగవ స్థానంలో కొనసాగుతుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. కానీ  రన్ రేట్ మాత్రం అటు బెంగళూరు జట్టు కంటే ఢిల్లీ క్యాపిటల్స్ కి మెరుగ్గా ఉండటం గమనార్హం. ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే ఈ రన్రేట్ తోనే ఇక ప్లే ఆఫ్ లో అడుగుపెడుతుంది. నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ జరగబోతోంది. దీంతో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ ఎలా ఆడబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఒకవేళ ఢిల్లీ జట్టు ఓడితే మాత్రం తప్పకుండా బెంగళూరు జట్టు ప్లేఆఫ్ వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl