30 ఏళ్ల లేటు వయసు లో కూడా సుదీర్ఘ ఫార్మాట్ లోకి ఎంట్రీ ఇచ్చి తనకు తిరుగులేదు అని నిరూపిస్తున్నాడు. తన వైవిధ్యమైన స్పిన్ మాయా జాలంతో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ లను సైతం ముప్పు తిప్పలు పెడుతున్నాడు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా మారిపోతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డును అందుకున్నాడు ప్రభాస్ జయసూర్య. కేవలం మూడు టెస్టులోనే 29 వికెట్లు పడగొట్టి జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇటీవల పాకిస్థాన్తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో ఎనిమిది వికెట్లు పడగొట్టి జయసూర్య శ్రీలంక జట్టు 246 పరుగుల భారీ తేడాతో అపురూప విషయం అందుకోవడంలో కీలక పాత్ర వహించాడు. ఇక అంతకుముందు ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా టెస్టులో రెచ్చిపోయి వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే శ్రీలంక ప్రేక్షకులందరికి కూడా అబ్బురపరిచే విజయాన్ని తన స్పిన్ బౌలింగ్ తో అందించాడు. పాకిస్తాన్తో జరిగిన తొలి టెస్టులో కూడా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఇలా మూడు టెస్ట్ మ్యాచ్ల లోనే 29 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు.