మళ్లీ విరాట్ కోహ్లీ గురించి అతని గణాంకాలు గురించి ఎలుగెత్తి చూపించాల్సిన పరిస్థితి వచ్చిందని అయన వ్యాఖ్యానించారు. కొహ్లీ ఇటీవలకాలంలో అనుకూల పరిస్థితులకు దూరం అయ్యాడు. అంటూ చెప్పుకొచ్చాడు వెస్టిండీస్ పర్యటనలో విరాట్ కోహ్లీ ఏ ఒక్క సిరీస్లో అయినా ఆడించి ఉంటే బాగుండేది అంటూ చెప్పుకొచ్చాడు. తర్వాత కాలంలో అతను ఎట్టి పరిస్థితుల్లో జట్టులోకి వస్తాడు అని చెప్పడంలో సందేహం లేదుఅంటూ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ గణాంకాలను అందరికీ మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది.
రోహిత్ శర్మ సూర్య కుమార్ యాదవ్ అన్ని మ్యాచ్ లలో పెద్దగా ఆడకపోయినా కానీ రెగ్యులర్ గా ఆడుతూ ఉన్నారు. ఆడిన మంచి ఇన్నింగ్స్ కి ఇమేజ్ తెచ్చుకుంటున్నారు. విరాట్ కోహ్లి విషయంలో అలా జరగటం లేదు. టీమిండియా ఆటగాళ్లను ఏ స్థానంలో ఎవరిని ఉంచాలన్నది ఫిక్స్ అవ్వాలి. ముఖ్యంగా ఇటీవలి వెస్టిండీస్ పర్యటనకు సూర్య కుమార్ యాదవ్ 4వ స్థానంలో కాకుండా ఓపనర్ గా రావటం ఆశ్చర్యపరిచింది. అయితే సూర్యకుమార్ యాదవ్ ను ఓపెనర్గా పంపించటం వెనుక ఉన్న ఆలోచన ఏంటో అన్నది మాత్రం అర్థం కావడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు ఆకాష్ చోప్రా..