వీరిద్దరూ మరో వికెట్ పడకుండా మ్యాచ్ ను ముగించారు. అలా సౌత్ ఆఫ్రికా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఈ స్కోర్ లో క్లాషెన్ 74 పరుగులు మరియు మిల్లర్ 75 పరుగులు చేశారు. అంతే కాకుండా అయిదవ వికెట్ కు 139 పరుగులు జోడించారు. ఇక ఇండియా బౌలర్లలో శార్దూల్ 2, కుల్దీప్ 1 మరియు బిష్ణోయ్ 1 వికెట్ తీసుకున్నారు. ఈ పిచ్ పైన కేవలం 40 ఓవర్లలో 250 పరుగులు చేయడం అంత సులభం కాదు. ఈ పిచ్ పైన ముఖ్యంగా స్వింగ్, బౌన్స్ మరియు టర్న్ అన్నీ ఉన్నాయి. సో... చాలా జాగ్రత్తగా ఆడితేనే లక్ష్యాన్ని అందుకునే ఛాన్సెస్ ఉంటాయి.
కాగా ఇప్పటికే ఇండియా ఛేజింగ్ లో అయిదు ఓవర్ లలో కీలక వికెట్ శుబ్ మాన్ ను కోల్పోయి కష్టాల్లో పడింది. పవర్ ప్లే లో వికెట్లు కాపాడుకుని, ఆ తర్వాత అటాక్ చెయ్యాలి. ఇక భారం అంతా కెప్టెన్ శిఖర్ మీదనే ఉంటుంది. మరి టీం ఇండియాను విజయం వైపుకు తీసుకు వెళ్తాడా లేదా తెలియాలంటే ఇంకాస్తసేపు వెయిట్ చేయాల్సిందే.