గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం బ్యాటింగ్ విషయంలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు అతను పేలవమైన ఫామ్ కారణంగా ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే అతన్ని టార్గెట్ చేస్తూ ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇటీవలే పాకిస్తాన్ జట్టు అటు ఇంగ్లాండ్తో సొంత గడ్డపై ఏడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడింది అని చెప్పాలి.  ఇక ఈ టి20 సిరీస్ లో భాగంగా బాబర్ అజాం మరోసారి సెంచరీ చేసి అదరగొట్టాడు. దీంతో మునుపటి ఫామ్ లోకి వచ్చాను అని తన బ్యాటింగ్ తో  చెప్పకనే చెప్పాడు.


 అయితే బాబర్ అజం సెంచరీ చేశాడు అని అటు అభిమానులు అందరూ కూడా ఎంతో సంతోష పడుతూ ఉన్న సమయంలో.. అతను చేసిన సెంచరీపై ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు ఎంతోమంది నెటిజెన్లు. ఒకప్పటిలా బాబర్ దూకుడుగా ఆడటం లేదని భారీగా పరుగులు చేస్తూ ఉన్నప్పటికీ ఎక్కువ బంతులు అతడు సమయం తీసుకుంటున్నాడు అంటూ ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు. అందుకే అతని స్ట్రైక్ రేట్ కూడా దారుణంగా పడిపోతుంది అంటూ విమర్శలు చేస్తున్నారు.



 అయితే ఇలా బాబర్ అజం స్ట్రైక్ రేట్ పై విమర్శలు చేస్తున్న వారిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమిజ్ రాజా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సరైన స్ట్రైక్ రేట్ కొనసాగించడం లేదు అంటూ బాబర్ వస్తున్న విమర్శలను ఖండించాడు రమిజ్ రాజా. మూడేళ్ల నుంచి విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ లో ఉన్న సమయంలో ఆఫ్గనిస్తాన్ పై ఒక్క సెంచరీ చేస్తే చాలు అంతకు ముందు జరిగిన అన్ని విషయాలను కూడా అందరూ మరిచిపోయారు. కానీ ఆసియా కప్ లో రన్నరపుగా నిలిచిన బాబర్ అజాం స్ట్రైక్ రేట్ పై ట్రోలింగ్ చేయడం మాత్రం పనికిమాలిన చర్య అంటూ రమిజ్ రాజా వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: