ఒకవైపు టీమ్ ఇండియా బ్యాట్స్మెన్లు పరుగులు చేయడానికి కష్టపడిన అదే మైదానంలో ప్రత్యర్థి బౌలర్లు మాత్రం పరుగుల వరద పారించారు అని చెప్పాలి. ఇలా బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లో కూడా పూర్తిగా చేతులెత్తేసింది ప్రత్యర్థి జట్టు.. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు టీమ్ ఇండియా పై పది వికెట్ల తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి. దీంతో వరుస విజయాలతో దూసుకు వచ్చిన టీమ్ ఇండియా సెమీఫైనల్ లో తడబడి ఇంటి బాట పట్టింది.
అయితే అటు టీమ్ ఇండియా ఓడిపోవడాన్ని భారత అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొంతమంది క్రికెట్ అభిమానులు భిన్నంగా కూడా స్పందిస్తున్నారు. భారత్ ఓడి మంచి పని చేసింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి ప్రదర్శనతో గెలవడం కష్టమని.. ఇక ఇంగ్లాండ్ పై ఓడిపోయింది కాబట్టి సరిపోయింది. పొరపాటున ఫైనల్ కు వెళ్లి చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి ఉంటే ఆ బాధను తట్టుకోలేకపోయే వాళ్ళం. అందుకే ఇప్పుడే ఓడిపోయి మంచి పని చేసింది అంటూ ఎంతో మంది కామెంట్లు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి