ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో నెటిజన్స్ అటెన్షన్ మొత్తం తమ వైపుకు తిప్పుకోవడానికి కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు సైతం కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు అని చెప్పాలి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఊర్వశి రతౌలా కూడా ఇక  ఇలాంటి కొత్త రూట్ ఎంచుకుంది. ఎందుకంటే బాలీవుడ్ లో ఎంత అందాల ఆడబోత చేసిన పట్టించుకునే వారే ఉండరు. ఎందుకంటే అక్కడ పాపులారిటీ కోసం అందాలను ఆరుబోసేవారు చాలా ఎక్కువే.


 అందుకే అందాల ఆరబోతను నమ్ముకోకుండా సరికొత్తగా తనవైపు అందరి దృష్టిని తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఊర్వశి రతౌలా. ఇందుకోసం ఇక దేశవ్యాప్తంగా ఎంతగానో గుర్తింపు సంపాదించిన స్టార్ క్రికెటర్ రిషబ్ పంతుతో రిలేషన్ ఉన్నట్లుగా తన పోస్టులతో అందరినీ కన్ఫ్యూజన్లో పడేసింది.. ఇప్పటికే నటన ద్వారా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు..  రిషబ్ పంత్ తనకోసం వారణాసి వచ్చి 10 గంటల పాటు హోటల్ లాబీలో వెయిట్ చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ మారిపోయింది.


 అయితే ఒకప్పుడు ఊర్వశీ రతౌలా, రిషబ్ పంత్  పీకల్లోతు ప్రేమలో ఉన్నారు అన్న ప్రచారం కూడా జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇలా ప్రచారం జరుగుతున్న సమయంలోనే రిషబ్ పంత్ ఊర్వసి సోషల్ మీడియాను బ్లాక్ చేసేసాడు. ఎక్కడికి వెళ్లినా కూడా ఊర్వసి అక్కడ ప్రత్యక్షమవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉండేది. దీంతో వీరిద్దరి మధ్య ఏదైనా రిలేషన్షిప్ ఉందా లేదంటే ఊర్వశి కావాలనే ఇలాంటి పనులు చేస్తుందా అని అందరూ ఆలోచనలో పడిపోయారు.


 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై భారత యువ క్రికెటర్ శుభమన్ గిల్ ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జనాలు ఊర్వశి పేరు చెప్పి రిషబ్ పంత్ ను ఏడిపిస్తూ ఉంటారు. మరి డ్రెస్సింగ్ రూమ్ లో కూడా ఇలాగే చేస్తారా అంటూ అతనికి ఒక ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురయింది. అయితే ఊర్వశి తన పేరును చెప్పి రిషబ్ ను ఏడిపించాలని.. డిస్టర్బ్ చేయాలని కోరుకుంటుంది. ఎలాగైనా జనాల అటెన్షన్ దక్కించుకోవాలని తన ఆరాటం. రిషబ్ పంత్ ఆమెను అస్సలు పట్టించుకోడు. ఎందుకంటే ఊర్వసి ఎందుకు అలా చేస్తుందో రిషబ్ పంత్ కు బాగా తెలుసు అంటూ శుభమన్ గిల్ చేసిన కామెంట్లు కాస్త ప్రస్తుతం హోహాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: