వచ్చే ఏడాది టి20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత మహిళల ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది. ఇందుకోసం ఇప్పటినుంచి సన్నాహాలను ప్రారంభించింది బీసీసీఐ. ఇక ఐదు ఫ్రాంచైజీల కొనుగోలు కోసం 400 కోట్లను ప్రాథమిక ధరగా నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టోర్నీ కోసం ఎంతో మంది మహిళా క్రికెటర్లు కూడా కల్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే మహిళా ఐపీఎల్ గురించి ఇటీవలే భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.
ఐపీఎల్ టోర్నీ దేశవాళీ ప్లేయర్స్ అందరికి కూడా ఒక మంచి వేదిక అంటూ చెప్పుకొచ్చారు హర్మన్ ప్రీత్. ప్రతిభవంతులైన ప్లేయర్లకు ఐపిఎల్ ఒక చక్కటి వేదిక. ఎందుకంటే ఐపీఎల్లో విదేశీ ప్లేయర్లతో ఆడేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడే అంతర్జాతీయ క్రికెట్ అంటే ఏమిటో ఇక ఐపీఎల్ ద్వారా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అంతే కాదు ఐపీఎల్ భారత్లో దేశియ, అంతర్జాతీయ మ్యాచ్లకు సంబంధించిన అంతరంగాన్ని తగ్గిస్తుంది అంటూ హర్మాన్ ప్రీత్ తో చెప్పుకొచ్చింది. ఇది మహిళా క్రికెట్కు ఒక మహర్దశ అని.. మంచి రోజులు రాబోతున్నాయి అంటూ సంతోషం వ్యక్తం చేసింది హార్మన్ ప్రీత్ కౌర్.