ఇండియా పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా మహిళల జట్టు అయిదు టీ 20 లను ఆడదానికి వచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు ముగిసిపోయాయి, ఇప్పటికే మూడు మ్యాచ్ లను గెలుచుకున్న ఆస్ట్రేలియా మహిళలు సిరీస్ ను కైవసం చేసుకున్నారు. గత మ్యాచ్ లో ఆఖరి వరకు పోరాడిన టీం ఇండియా గెలుపు ముంగిట బోల్తా పడింది. కాగా ఈ రోజు ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం లో ఆస్ట్రేలియా మరియు ఇండియా జట్ల మధ్యన ఆఖరి టీ 20 జరగనుంది. ఈ మ్యాచ్ లో అయినా గెలిచి ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా మహిళలు.. గత మ్యాచ్ లో కెప్టెన్ అలీషా హీలీకి గాయం కావడంతో ఆమెకు బదులుగా లీచ్ ఫీల్డ్ జట్టులోకి వచ్చింది.

ఈ గ్రౌండ్ లోనూ పరుగుల వరద ఖాయంగా తెలుస్తోంది. ఆస్ట్రేలియా మహిళలు బౌలింగ్ లో పర్వాలేదనిపిస్తున్న బ్యాటింగ్ లో మాత్రం అందరూ తమ సత్తా చాటుతున్నారు. ఇండియా బౌలర్లను తుత్తునియలు చేస్తూ గత నాలుగు మ్యాచ్ లలోనూ పరుగులు పిండుకున్నారు. ముఖ్యంగా మూనీ, మెగ్రాత్ , హీలీ , పెర్రీ , గార్డెనర్ మరియు హరీష్ లు రాణించారు. ఇక ఓడిపోయిన మూడు మ్యాచ్ లలోనూ ఇండియా గెలుపు ముంగిట వరకు వచ్చి బోర్లా పడింది. సరైన ముగింపు ఇచ్చే ఆటగాళ్లు లేకపోవడమే ఇండియా బలహీనత అన్ని చెప్పాలి. ఇక ఈ సిరీస్ మొత్తం కూడా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఆశించిన విధంగా రాణించలేదు.

ప్రస్తుతం జరుగుతున్న ఆఖరి మ్యాచ్ లో అయినా గెలిచి సిరీస్ ను 2-3 తో ముగించి పరువును కాపాడుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఆస్ట్రేలియా జోరు చూస్తుంటే ఈ మ్యాచ్ లో కూడా ఖచ్చితంగా 170 కి పైగా పరుగులు సాధిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆస్ట్రేలియా ఎంత స్కోర్ చేసినా ఇండియా ఛేదిస్తుందా చూడాలి. ఈ మ్యాచ్ లో వరుసగా ఫెయిల్ అవుతున్న స్మృతి మందన్న , రోడ్రిగస్ మరియు హర్మన్ లు రాణించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: