ఇదిలా ఉంటే.. ఇక ఈ టి20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో రెండు పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. అయితే రెండో టి20 మ్యాచ్ లో మాత్రం భారత బౌలింగ్ విభాగం చేతులేత్తేయడం.. ఇక బ్యాటింగ్ విభాగం పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోవడంతో చివరి వరకు పోరాడినప్పటికీ 16 పరుగుల తేడాతో టీమ్ ఇండియా ఓడిపోయింది. దీంతో ప్రస్తుతం మూడు మ్యాచ్ల టి20 సిరీస్ లో భాగంగా ఇరుజట్లు చేరో మ్యాచ్ గెలవడంతో 1-1 తో సిరీస్ సమంగా కొనసాగుతుంది. కాగా నేడు మూడో టి20 మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే..
ఈ క్రమంలోనే సిరీస్లో విజయం సాధించాలంటే మాత్రం ఇక నేడు జరగబోయే మూడో టి20 టీమిండియా తో పాటు శ్రీలంక కూడా తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పాలి. ఇలా మూడో టి20 మ్యాచ్ సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మ్యాచ్ గా మారిపోయింది. రాజ్కోట్ వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది అని చెప్పాలి. ఇప్పుడు వరకు జరిగిన మ్యాచ్లో టీం ఇండియా నిలకడలేమిటో ఇబ్బంది పడితే.. లంక మాత్రం బౌలింగ్ బ్యాటింగ్లో సత్తా చాటుతుంది. మరి నేడు కీలకమైన మ్యాచ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి