ఇక మిథాలీ రాజ్ ఇలా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ టీమిండియా మహిళల జట్టు సారథి బాధ్యతలను చేపట్టి ఇక జట్టును ముందుకు నడిపిస్తూ ఉంది అని చెప్పాలి. అయితే మిథాలీ రాజ్ ఇలా క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాతే ఇక ఎన్నో రోజులుగా మహిళా క్రికెటర్లు అందరూ కూడా ఎదురు చూస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ఇక ఈ లీగ్ కి సంబంధించి ఇటీవల జరిగిన వేలంలో ఎంతమంది ప్లేయర్లు కోట్ల రూపాయలు దక్కించుకున్నారు. ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటించకుండా ఉంటే మిథాలీ రాజ్ కూడా కోట్ల రూపాయలు దక్కించుకునేది అని చెప్పాలి.
ఈ క్రమంలోనే మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించినందుకు బాధపడుతూ ఉండవచ్చు అని కొంతమంది అభిప్రాయపడ్డారు. ఇక ఇటీవలే ఇదే విషయంపై స్పందించిన మిథాలీ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినందుకు తాను బాధపడట్లేదు అంటూ చెప్పుకొచ్చింది ఈ మాజీ కెప్టెన్. తన కెరీర్లో ప్రతి దశను ఆస్వాదించానని సరైన సమయంలోనే క్రికెట్ నుంచి తప్పుకున్నాను అంటూ తెలిపింది. కాగా మిథాలీ రాజ్ 12 టెస్టులు 232 వన్డేలు, 99 టి20 లు ఆడింది. ప్రస్తుతం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ జట్టుకు మెంటర్ గా ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి