
కాగా గత రాత్రి జరిగిన మరో మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ సేన ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో వికెట్ల తేడాతో పరాజయం పాలయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్ లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులకు మాత్రమే పరిమితం అయింది. ఢిల్లీ బౌలర్లు ఎంతో కట్టుదిట్టమైన బ్యాటింగ్ లైన్ అప్ ఉన్న ముంబై ని టోర్నీలోనే తక్కువ స్కోర్ కు కట్టడి చేశారు. ఢిల్లీ బౌలర్లలో కప్ , జొనస్సేన్ మరియు శిఖా పాండేలు తలో రెండు వికెట్లు తీసి ముంబై పతనాన్ని శాసించారు.
ఛేదనలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ముంబై బౌలర్లను ఆది నుండి చీల్చి చెండాడారు.. ముఖ్యంగా షెపాలీ వర్మ అయితే 220 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేసింది.. తాను చేసిన 33 పరుగులతో 6 ఫోర్లు మరియు 1 సిక్స్ ఉన్నాయి. ఆ తర్వాత క్యాప్సి రంగంలోకి దిగింది... ఈమె సిక్సర్ లతో ముంబై బౌలర్లపై విరుచుకుపడింది. తాను ఎదుర్కొన్న 17 బంతులలో 5 సిక్సులు మరియు ఒక ఫోర్ తో పరుగులు చేసి ఢిల్లీ ని కేవలం 9 ఓవర్ లలోనే విజయ తీరాలకు చేర్చింది. దీనితో ఢిల్లీ మొదటి స్థానానికి ఎగబాకింది. అలా ముంబై తాము ఆడిన లాస్ట్ రెండు మ్యాచ్ లలో ఓడిపోయి వెనుకబడిపోయింది. మరి చూద్దాం ఇక మిగిలిన ఒక మ్యాచ్ లో గెలిచి డైరెక్ట్ గా ఫైనల్ చేరుతుందా లేదా ?