విరాట్ కోహ్లీపై భారత క్రికెట్ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కెరియర్ లో ఇంత ఎత్తుకు ఎదుగుతాడని తాను ఊహించలేదని ఈ మాజీ డాషింగ్ ఓపెనర్ కోహ్లీపై తన అభిప్రాయాన్ని తెలిపారు. ఎందుకంటే  విరాట్ కోహ్లీ పూర్తిగా దూకుడుతో కూడిన ఆట ఆడుతుంటాడు అందుకే తాను కోహ్లీ పై ఇలాంటి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నానని తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు. అంతేకాకుండా మరిన్ని విషయాలను సైతం వీరేంద్ర కోహ్లీ గురించి వ్యక్తపరిచాడు. అతడు బయటకు కనిపించని టన్నుల కొద్ది బలం అలాగే ఉంది ఆ టాలెంట్ ఏంటో నాకు మాత్రమే తెలుసు మొదట్లో అతడు ఇంత స్థాయికి ఎదుగుతాడని నేను అసలు ఊహించలేదు.

చాలామంది అతిపెద్ద నమ్మకం పెట్టుకున్నారు. కానీ నేను మాత్రం అతడు క్రికెట్ జట్టు నుంచి కనుమరుగు అవుతాడు అని భావించాను. గతంలో లసిద్ మలింగ వేసిన బౌలింగ్ లో ఒక ఓవర్ కు నాలుగు ఫోన్లు వదిన కేవలం 40 ఓవర్లలోనే 280 పరుగులు చేసి అంతే అద్భుతమైన సెంచరీని టీమిండియా కు అందించి జట్టును గెలిపించిన, కెరీర్ మొత్తం 75 సెంచరీలు చేసి ఇంత దూరం వరకు వచ్చిన తాను ఇంతటి వారు అవుతాడని నేను ఊహించలేదు. అపారమైన ప్రతిభ ఉన్న అతడు దాన్ని ఉపయోగించుకోడు అనే భావన నాలో ఎప్పుడూ ఉండేది. కేవలం అతడు దూకుడు ప్రవర్తనతో తనలో ఉన్న సత్తాను బయటకు చూపించడు అని క్రికెట్ ఆడతాడు అనే నమ్మకం కలగలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

తన కెరీర్ మొత్తంలో 25 వేల ఇంటర్నేషనల్ రన్స్ చేస్తాడని 75 శతకాలు బాలుతాడని అనుకోలేదని సెహ్వాగ్ స్పష్టం చేశాడు. ఇక ఇప్పుడు విరాట్ ని చూస్తుంటే ఆరోజు నేను చూసిన కుర్రాడేనా ఇంతలా సాధిస్తుంది అని అప్పుడప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటాను అంటూ తెలిపాడు. పార్టీలకు బాగా తిరుగుతూ ఉండేవాడు నాతో పాటు బ్యాటింగ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవాడు కొత్తగా ఏం చూపిస్తున్నాడు అని అనుమానం వచ్చేది కానీ రాను రాను క్రమశిక్షణ పెంచుకున్నాడు ఫిట్నెస్ ని కాపాడుకున్నాడు, రన్స్ చేయడం అలవాటు చేసుకున్నాడు, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నాడు వీటన్నిటిపై ఫోకస్ పెట్టాడు కాబట్టి చాలా మంది క్రికెటర్లు సాధించలేనిది కోహ్లీ సాదిస్తున్నాడు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: