వరల్డ్ క్రికెట్లో చిరకాల ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న టీమ్స్ ఏవి అంటే క్రికెట్ ప్రేక్షకులందరూ ఆ టీమ్స్ ఏవో కాదు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అని చెబుతూ ఉంటారు. వరల్డ్ క్రికెట్లో సమఉజ్జీలుగా కొనసాగుతున్న ee టీమ్స్ ఎప్పుడు పోటీపడినా కూడా ఉత్కంఠ ఒక రేంజ్ లో ఉంటుంది అని చెప్పాలీ. నువ్వా నేనా అన్నట్లుగా ఈ రెండు జట్లు పోటీ పడుతూ ఉంటాయి. అందుకే ఈ రెండు టీమ్స్ ని చిరకాల ప్రత్యర్ధులు అని పిలుచుకోవడం మొదలు పెడుతూ ఉంటారు ప్రేక్షకులు. అయితే ఈ రెండు టీమ్స్ కూడా అటు యాషెష్ సిరీస్ ని ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ఏకంగా సిరీస్ లో విజయం సాధిస్తే వరల్డ్ కప్ గెలిచాము అన్నట్లుగా సంబరపడిపోతూ ఉంటారు ఆయా జట్ల ఆటగాళ్లు, అభిమానులు.  ఇలా అంతలా యాషెష్ సిరీస్ ని గౌరవంగా భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. అందుకే ఎప్పుడు ఈ రెండు టీమ్స్ మధ్య  సిరీస్ జరిగిన కూడా ఇక ఉత్కంఠ మరో లెవెల్ లో ఉంటుంది  కాగా ప్రస్తుతం ఈ రెండు టీమ్స్ మధ్య ఇదే సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న సిరీస్ లో అటు ఆతిథ్య  ఆసీస్ జట్టు అదరగొట్టింది అని చెప్పాలి. ఏకంగా మొదటి రెండు మ్యాచ్లలో విజయం సాధించింది. కానీ తర్వాత అనూహ్యంగా ఇంగ్లాండ్ జట్టు పుంజుకుంది.


 మూడో టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది అని చెప్పాలి. అయితే ఇక నాలుగో మ్యాచ్లో ఇక ఇంగ్లాండ్ దూకుడైన అటు తీరు చూస్తే తప్పకుండా గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు. సిరీస్ సమం చేస్తుందని భావించారు. కానీ ఊహించని రీతిలో అటు ఇంగ్లాండ్కు వరునుడి రూపంలో ఆటంకం ఏర్పడింది. దీంతో నాలుగో టెస్ట్ డ్రాగ ముగిసింది. కాగా ఇంగ్లాండుకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. చివరి రెండు రోజులు ఆట వర్షార్పణం కావడంతో చివరికి మ్యాచ్ డ్రాగా ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్ లో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్లు గెలవగా.. ఇంగ్లాండ్ ఒక మ్యాచ్ గెలిచింది. ఒక మ్యాచ్ డ్రాగ ముగుసింది. కాగా ఐదవ మ్యాచ్ ఈ నెల 27వ తేదీన జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: