కడుపున పెట్టుకుని చూసుకుంటున్న అమ్మని నీచంగా చూస్తే సభ్య సమాజంలో బ్రతుకుతున్నాం అందరం.. ఇది ఎవరో చెప్పడం కాదు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటన ద్వారా ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. అయితే అమ్మని నీచంగా  చూస్తున్న నేటి సమాజంలో అన్న భార్య అమ్మతో సమానం అన్న మాటను ఎప్పుడో మర్చిపోయారు జనాలు. ఈ క్రమంలోనే వావివరసలు మరిచి దారుణంగా ప్రవర్తిస్తున్న నీచమైన జనాలే నేటి రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా ఘటనలు చూసిన తర్వాత నేటి సభ్య సమాజంలో మానవ బంధాలకు విలువ లేకుండా పోతుంది అన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది.


 క్షణకాల వాంఛ తీర్చుకోవడానికి ఎంతో మంది ఏకంగా అడవుల్లో ఉండే మృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఏకంగా కొంతమంది అక్రమ సంబంధాలకు తిరలేపుతూ చివరికి కాపురాల్లో చేజేతులారా చిచ్చు పెట్టుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇంకొంతమందిని ఇక ఇలాంటి సుఖం కోసం ప్రాణాలు కూడా తీసుకుంటూ ఉన్న ఘటనలు ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ నగరంలోని బోయిన్ పల్లిలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. అమ్మ అని భావించాల్సిన అన్న భార్య పైనే కన్నేసాడు ఒక వ్యక్తి. చివరికి ఆమెతో అక్రమ సంబంధానికి తెరలేపాడు.


 ఆ తర్వాత  పెళ్లి చేసుకోవాలి అంటూ ఒత్తిడి చేశాడు. కానీ అందుకు ఆమె నిరాకరించింది. దీంతో మనస్థాపానికి గురై ప్రాణాలు తీసుకున్నాడు. హర్యానాకు చెందిన ప్రదీప్ కుమార్ తన స్నేహితులతో కలిసి పాత బోయిన్పల్లి జీఎస్టీ కాంప్లెక్స్ లో ఉంటున్నాడు. ఇక రవాణా సంబంధిత పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ప్రదీప్ కుమార్ అన్నయ్య శివ కుమార్ కూడా ఉపాధి కోసం నగరానికి వచ్చి భార్యతో కలిసి బోయినపల్లిలో ఉంటున్నాడు. ఇక ప్రదీప్ అప్పుడప్పుడు అన్నయ్య దగ్గరికి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే  అన్న భార్యకు ప్రదీప్ కు మధ్య స్నేహం ఏర్పడింది. అది అక్రమ సంబంధానికి దారితీసింది. అయితే ఇక అన్నయ్యను వదిలేసి తనను  పెళ్లి చేసుకోవాలని ప్రదీప్ ఆమెను ఒత్తిడి చేయగా.. ఆమె మాత్రం నిరాకరించింది. ఈ క్రమంలోనే మనస్థాపం చెందిన ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: