టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధోని 2019లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ ప్రస్తుతం టీమిండియాలో ఉన్న స్టార్ క్రికెటర్లతో పోల్చి చూస్తే అటు ధోనికే కాస్త క్రేజ్ ఎక్కువగా ఉంది అని చెప్పాలి. అంతేకాదు అటు భారత జట్టుకు రెండు వరల్డ్ కప్ లు అందించిన ఏకైక కెప్టెన్ గా కూడా కొనసాగుతూ ఉన్నాడు మహేంద్ర సింగ్ ధోని. ఇక ప్రపంచ క్రికెట్లో బెస్ట్ కెప్టెన్ గా బెస్ట్ ఫినిషర్గా బెస్ట్ వికెట్ కీపర్ గా కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.



 అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోని గురించి భారత క్రికెట్లో అందరూ కూడా ఎంతో గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఒక్క మాజీ క్రికెటర్ మాత్రం ధోనీని విమర్శించడమే పనిగా పెట్టుకుంటూ ఉంటాడు. ఆ మాజీ క్రికెటర్ ఎవరో కాదు గౌతమ్ గంభీర్. ఒకప్పుడు భారత జట్టుకు డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ గా ఉన్న గౌతమ్ గంభీర్ ఇక టీమిండియా కు ఎన్నో అద్వితీయమైన విజయాలను అందించాడు. ఇక ధోని కెప్టెన్సీలో అతను రెండు వరల్డ్ కప్ లు గెలవడంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. అలాంటి గంభీర్ ఏకంగా ధోనిపై విమర్శలు చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ఇక ధోని గురించి గంభీర్ ఎప్పుడైనా పాజిటివ్గా మాట్లాడాడు అంటే చాలు అందరూ షాక్ అవుతూ ఉంటారు.


 ఇక ఇప్పుడు గౌతమ్ గంభీర్  ఇదే చేశాడు  మహేంద్రసింగ్ ధోని పై ఏకంగా ప్రశంసలు కురిపించాడు. ఒక కెప్టెన్గా టీం ని నడిపించేందుకు ధోని ప్రాధాన్యత ఇచ్చాడు అంటూ చెప్పుకొచ్చాడు. కెప్టెన్సీ వల్ల ఒక బ్యాటర్ గా తాను సాధించిన రికార్డులను ధోని పొందలేకపోయాడు అంటూ గంభీర్ వ్యాఖ్యానించాడు. ఒకవేళ ధోని కెప్టెన్ కాకపోయి ఉంటే నెంబర్ త్రీ పొజిషన్లో ఆడేవాడు. ఇక పలు వన్డే రికార్డులను బద్దలు కొట్టేవాడు. అయితే కెప్టెన్ గా ఎన్నో ట్రోఫీలు సాధించిన.. ఒక బ్యాట్స్మెన్ గా మాత్రం అతను ఎన్నో పరుగులను త్యాగం చేశాడు అంటూ గౌతం గంభీర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: