ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో భాగంగా పాల్గొనబోయే పది జట్లు కూడా ఇక విశ్వవిజేతగా నిలవడమె లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతు ఉన్నాయి. అయితే ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావడం.. ఇక అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా వరల్డ్ కప్ కోసం తమ జట్టును ప్రకటించడం జరిగిపోయింది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇప్పటికే అన్ని టీమ్స్ కూడా భారత గడ్డపై అడుగుపెట్టాయి. ఇక వార్మప్ మ్యాచ్ లు కూడా ఆడటం మొదలుపెట్టాయి. అక్టోబర్ 5వ తేదీ నుంచి అధికారిక మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ఏ టీం అత్యుత్తమ ప్రదర్శన చూస్తుంది అనే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా రివ్యూ ఇస్తున్నారు. దీంతో ఇలాంటి రివ్యూలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయ్. అయితే ఇప్పుడు మరో విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ప్రపంచ క్రికెట్లో స్టార్లుగా రాబోయే కాలానికి లెజెండ్స్ గా కొనసాగుతున్న కొంతమందికి ఇదే చివరి వన్డే వరల్డ్ కప్ అన్నది అర్థమవుతుంది.


 అయితే ప్రస్తుతం ఉన్న వయస్సు కారణంగా వన్డే క్రికెట్లో పలువురూ లెజెండరీ క్రికెటర్లకు ఇదే చివరి వరల్డ్ కప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి క్రికెటర్లలో భారత కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఇక భారత జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న విరాట్ కోహ్లీ తో పాటు.. ఆస్ట్రేలియా కు చెందిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మీచల్ స్టార్క్. ఇంగ్లాండ్ కు చెందిన జోరూట్, బెన్ స్టోక్స్. న్యూజిలాండ్ కు చెందిన విలియంసన్. బంగ్లాదేశ్ కు చెందిన షాకీబ్ ఉల్ హసన్ ఉన్నారు  వీరందరూ రిటైర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వీరి ఫిట్నెస్ యంగ్ ప్లేయర్లకు మించి ఉందని వచ్చే వరల్డ్ కప్ లో కూడా ఆడాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: