![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/sports/libra_libra/ipl033b0b57-c0a4-4b1a-92df-36bcf974e9f7-415x250.jpg)
ఇకపోతే ఇప్పటికే 2024 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన హడావిడి ఇండియాలో మొదలైంది. ఈ క్రమంలోనే ఐపిఎల్ గురించి ఎప్పటికప్పుడు ఎన్నో వార్తలు కూడా తెరమీదికి వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే బీసీసీఐ ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మార్చ్ నెలలో ఐపీఎల్ ఉన్న నేపథ్యంలో.. అదే సమయంలో అటు సార్వత్రిక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ఐపిఎల్ షెడ్యూల్ విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఈ విషయంపై ఇప్పటివరకు ఒక క్లారిటీ కూడా రాలేదు.
అయితే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ క్రికెట్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్ 2024 సీజన్ మార్చ్ 22వ తేదీ నుంచి ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నాము అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయాన్ని క్రీడా వర్గాలు వెల్లడించడం గమనార్హం అయితే మొదట ఐపీఎల్ కు సంబంధించి మొదటి విడత షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఇక సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చిన తర్వాత రెండో విడత ఐపిఎల్ నిర్వహణకు సంబంధించి ఇక షెడ్యూల్ ని విడుదల చేస్తాము అంటూ చెప్పుకొచ్చారు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్.