భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎన్నో రోజుల నుంచి వేయికళ్లతో ఎదురు చూస్తూ వచ్చిన ఐపీఎల్ నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ఇండియాలో మొదలు కాబోయే ఈ క్రికెట్ పండుగ ఎంజాయ్ చేసేందుకు ప్రేక్షకులు అందరూ కూడా సిద్ధం అయిపోయారు అని చెప్పాలి. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ ఐపీఎల్ మ్యాచ్ల గురించే మాట్లాడుకుంటూన్నారు. కాగా నేడు అంగరంగ వైభవంగా జరగబోయే ప్రారంభ వేడుక తర్వాత రాత్రి 8 గంటలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి.


 అయితే గత ఏడాది డిసెంబర్లో జరిగిన వేలంలో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను వదులుకున్నాయ్ ఫ్రాంచైజీలు. అదే సమయంలో ప్రతిభగల ఆటగాళ్లను పోటీపడి మరియు జట్టులోకి తీసుకున్నాయి అనే విషయం తెలిసిందే. ఇలా టీమ్ లోకి వచ్చిన కొత్త ఆటగాళ్లతో పక్క ప్రణాళికలతో బలిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలో కొన్ని టీమ్స్ కి మాత్రం ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎందుకంటే ఐపీఎల్ ప్రారంభానికి ముందే జట్టులో ఉన్న స్టార్ ప్లేయర్స్ గాయం బారిన పడుతూ దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది.


 అయితే నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతుండగా.. అటు రాజస్థాన్ రాయల్స్ జట్టుకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పాలి. ఎందుకంటే ఆ జట్టు స్టార్ స్పిన్నర్ ఆడం జంపా టోర్ని నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో చాలా మంది ప్లేయర్లు వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ టోర్నీ నుంచి వైదొలుగుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న ఆడం జంపా సైతం ఇలాంటి వ్యక్తిగత కారణాలతోనే ఐపిఎల్ టోర్ని నుంచి తప్పుకున్నాడట. కాగా ఈ ప్లేయర్ ఇప్పటివరకు రాజస్థాన్ జట్టు తరఫున 20 మ్యాచ్ లు ఆడి 29 వికెట్లు పడగొట్టాడు. అయితే ఐపీఎల్ లో కోట్లు వస్తున్న ఇలా ప్లేయర్లు వరుసగా వ్యక్తిగత కారణాలు అంటూ చెప్పి టోర్ని నుంచి ఎందుకు తప్పుకుంటున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl