అయితే ఈ ఐపీఎల్ సీజన్లో అందరి అంచనాలను తారుమారు చేస్తూ వరుస ఓటములతో అభిమానులను నిరాశపరిచిన ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ముంబై హోం గ్రౌండ్ అయిన వాంకడె స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో అటు ముంబై ఇండియన్స్ జట్టు ఘన విజయాన్ని సాధించింది అని చెప్పాలి. ఒకవైపు అటు ముంబై బౌలింగ్ విభాగం చెలరేగిపోవడం ఇంకోవైపు అటు ఆ జట్టు బ్యాటింగ్ విభాగం విధ్వంసం సృష్టించడంతో ఎంతో అలవోకగా బెంగళూరు టీం పై విజయం సాధించింది. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్ లో అటు ముంబై బౌలర్ బుమ్రా తన బౌలింగ్ తో ప్రత్యర్ధులను వనికించాడు.
ఏకంగా ఐదు వికెట్లు తీసి చెలరేగిపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో రెండు సార్లు హ్యాట్రిక్ కూడా మిస్ కావడం గమనార్హం. అయితే ఈ ప్రదర్శనతో అరుదైన రికార్డును సృష్టించాడు. ఐపీఎల్ లో ఆర్సిబి పై ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్గా అవతరించాడు. చివరిగా ఆశీష్ నెహ్ర చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బెంగళూరు టీం పై నాలుగు వికెట్లు తీశాడు. కానీ ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా ఆ జట్టుపై ఐదు వికెట్ల హాల్ సాధించలేదు. దీంతో ఆశిష్ నెహ్ర సాధించిన నాలుగు వికెట్ల బెంగళూరు టీం పై అత్యుత్తమ గణాంకాలుగా ఉన్నాయి. కానీ బుమ్రా ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టి ఏకంగా ఐదు వికెట్లు సాధించాడు.