సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒకప్పుడు కేవలం అద్భుతమైన బౌలింగ్కు మాత్రమే కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. బ్యాట్స్మెన్లు అతి తక్కువ పరుగులు చేసినప్పటికీ బౌలర్లు ఇక అద్భుతమైన బంతులను సంధిస్తూ అతి తక్కువ పరుగుల టార్గెట్ ని కాపాడుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఇలాంటి జట్టుతోనే ఒకసారి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అప్పుడెప్పుడో వార్నర్ కెప్టెన్సీలో టైటిల్ విజేతగా కూడా నిలిచింది. అయితే ఇక మును పెన్నడూ లేని విధంగా ఈ ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ పటిష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్ లోనే కాదు బ్యాటింగ్ లోను ప్రత్యర్థులకు దీటుగా బదిలిస్తుంది.


 అంతకుమించి అనే రేంజ్ లోనే ప్రస్తుతం అటు సన్రైజర్స్ బ్యాటింగ్ విభాగం చెలరేగిపోతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని సన్రైజర్స్ బాటర్లు విధ్వంసమే సృష్టిస్తూ ఉన్నారు. ఇక ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా ఇలాగే చెలరేగిపోయారు.  ముఖ్యంగా ఆరు ఓవర్లు ముగిసేసరికి ఏకంగా 125 పరుగులు చేశారు. సన్రైజర్స్ ఓపెనర్లు దీన్నిబట్టి వారి విధ్వంసం ఎలా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా 266 పరుగులు చేశారు. అయితే ఈ మ్యాచ్ లో అటు ఢిల్లీ క్యాపిటల్స్ కావడం 199 పరుగులకు మాత్రమే ఆల్ అవుట్ కావడంతో చివరికి 67 పరుగులు తేడాతో సన్రైజర్స్  విజయం సాధించింది.



 అయితే ఈ మ్యాచ్ లో విజయం మాత్రమే కాదు అటు సన్రైజర్స్ ఒక సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ హిస్టరీలో 250 ప్లస్ స్కోరు మూడుసార్లు చేసినా ఏకైక జట్టుగా నిలిచింది సన్రైజర్స్. గతంలో ఆర్సిబి రెండుసార్లు ఈ ఘనతను సాధించింది. కానీ అటు సన్రైజర్స్ మాత్రం మూడుసార్లు  ఇలా 250 ప్లస్ స్కోరు చేయడం గమనార్హం. ఆర్ సి బి తో జరిగిన మ్యాచ్లో 287 ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో 277 ఇక ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో 266 పరుగులు చేసింది సన్రైజర్స్ జట్టు. ప్రస్తుతం సన్రైజర్స్  దూకుడు చూస్తుంటే రెండోసారి టైటిల్ విజేతగా నిలిచే లాగానే కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: