ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. జూన్ నెలలో ఇక ఈ ప్రపంచకప్ టోర్నీ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈసారి ఈ ఐసీసీ టోర్నీకి యూఎస్ క్రికెట్ బోర్డులు ఆతిథ్యం ఇస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటికే వరల్డ్ కప్ మ్యాచ్ లు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అని చెప్పాలి. అయితే ఇప్పటికే ప్రపంచకప్ ఆడబోయే జట్టు వివరాలను ప్రకటించిన ఆయా దేశాల క్రికెట్ బోర్డులు.. ఇక వరల్డ్ కప్ లో విజయం కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నయ్.


 అయితే బీసీసీఐ కూడా ఇటీవల టీ20 వరల్డ్ కప్ ఆడబోయే 15 మంది సభ్యుల వివరాలు ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక వరల్డ్ కప్ లో టీమిండియా ఆటగాళ్లు ధరించబోయే కొత్త జెర్సీని కూడా ఇటీవలే విడుదల చేసింది. ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ దృశ్య భారత జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడిన కూడా ఏకంగా టీమిండియా జెర్సీని ధరించి స్టేడియంలో మ్యాచ్ చూడడానికి ప్రేక్షకులు అందరూ కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు వరల్డ్ కప్ మ్యాచ్లను చూసేందుకు కూడా రెడీ అవుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఇక టీమ్ ఇండియా జెర్సీని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడ ధర చూసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు  


 ప్రముఖ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ టీమిండియా కిట్ స్పాన్సర్ అయిన అడిడాస్ ఇక వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియా ఆటగాళ్లకు జెర్సీని రూపొందించింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న టీమ్ ఇండియా అభిమానులందరికీ కోసం ఈ జెర్సీలను ఆన్లైన్, ఆఫ్ లైన్ స్టోర్లలో కూడా అమ్మకానికి ఉంచింది. అయితే ఈ జెర్సీ ధర తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ప్లేయర్స్ ఎడిషన్ ధర 5999 రూపాయలుగా ఉంది. ఇక ఫ్యాన్స్ ఎడిషన్ ధరను 999గా నిర్ణయించింది. అయితే ధరలు ఎక్కువగా ఉన్నాయి అంటూ కొంతమంది క్రికెట్ అభిమానులు పెదవి వివరిస్తున్నారు. ఇలాంటి జెర్సీలు మా దగ్గర అయితే 100, 200 లకు వచ్చేస్తాయి అని మరి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: