(ఐ పీ ఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మంచి ప్రదర్శనను కనబరిచి ఫైనల్ వరకు చేరుకుంది. ఇక లీగ్ దశలో సన్రైజర్స్ జట్టు మంచి ప్రదర్శనను కనబరిచి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది. దానితో ఈ జట్టు ప్లే ఆప్స్ లో భాగంగా మొదటి మ్యాచ్ ను పాయింట్ల పట్టిక లో మొదటి స్థానంలో ఉన్న కోల్కతా జట్టుతో ఆడింది.

ఇక ఇందులో సన్రైజర్స్ జట్టు ఓడిపోయింది. ఇక ఆ తర్వాత ప్లే ఆప్స్ భాగంగా బెంగళూరు తో గెలుపొందిన రాజస్థాన్ రాయల్స్ జట్టుతో హైదరాబాద్ జట్టు నిన్న రాత్రి తలపడింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు గెలుపొందింది. దీనితో సన్రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ కు వెళ్ళింది. ఇక రేపు కోల్కతా మరియు హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారా అనేది ఉత్కంఠగా మారింది. ఇకపోతే కొన్ని లాజిక్ లను బట్టి చూసినట్లు అయితే సన్రైజర్స్ జట్టు రేపు మ్యాచ్ గెలవబోతున్నట్లు తెలుస్తుంది. ఆ లాజిక్ ఏమిటో తెలుసుకుందాం.

2008 వ సంవత్సరం (ఐ పి ఎల్) మొదటి సీజన్ ప్రారంభం అయింది. ఇందులో దక్కన్ చార్జెస్ జట్టు ఆ సంవత్సరం పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. రెండవ సీజన్ అయినటువంటి 2009 వ సంవత్సరం దక్కన్ చార్జెస్ జట్టు ట్రోఫీ ని గెలుచుకుంది. ఆ విధంగా చూసినట్లు అయితే పోయిన సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టిక లో చివరి స్థానంలో నిలిచింది. ఇక ఈ సారి హైదరాబాద్ జట్టు ఫైనల్ కు వెళ్ళింది. దానితో ఈ సారి హైదరాబాద్ జట్టు దే విజయం అని చాలా మంది ఈ లాజిక్ ప్రకారం మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

srh