బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు కొంటె రాక్షసులు, మంచి మనుషులు టాస్క్ కొనసాగింది....జోకులు చేయొద్దు అంటూ సోహెల్ రియానాపై మండి పడ్డాడు ..గత కొద్ది రోజులుగా సోహెల్ కి మరియు రియనాకి మధ్య కొద్దిగా గ్యాప్ కొనసాగుతోంది...ఈ టాస్క్ లో మరికాస్త వాగ్దానాలు విసురుకున్నారు రియానా మరియు సోహెల్ లు...కుండలతో ఇచ్చిన డ్రమ్ములలో మంచి మనుషుల టీమ్ నీళ్లు నింపుతున్న సందర్భంలో రియానా నీళ్లు నింపకుండా అడ్డుకున్నందుకు రియానాని ఇదేమి జోక్ కాదు అంటూ అరిచాడు సోహెల్...దాంతో అరియానా తన గొంతుని మరికాస్త పెంచింది....సోహెల్ ను వ్యతిరేకిస్తూ ఆ విషయం నాకు తెలుసంటూ తన కోపాన్ని చూపింది....

మరోవైపు మంచి మనుషుల టీమ్ కి చెందిన అఖిల్ రాక్షసుల టీమ్  కు చెందిన మెహబూబ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసాడు...వీరిద్దరిమద్య మాటల యుద్ధం కాస్త గట్టిగానే జరిగిందని  చెప్పాలి. టాస్క్ లో బాగంగా సోహెల్, తమ నీటి డ్రమ్ములను రక్షించుకుంటున్న సమయంలో మెహబూబ్ అడ్డుపడడంతో వీరి నడుమ జరిగిన వ్యహారంతో టాస్క్ లోని ఉత్సాహం కాస్త తగ్గినట్టే కనిపించింది, అంతేకాకుండా ఇంటి వాతావరణం మరి కాస్త వేడెక్కిందనే చెప్పాలి. దమ్ముంటే వచ్చి నీటి డ్రమ్మును కిందకి తొయ్యి అంటూ మెహబూబ్ ని ఛాలెంజ్ చేసాడు అఖిల్, దానికి మెహబూబ్ ఎలా రియాక్ట్ అయి ఉంటాడో అందరికి తెలిసిందే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు... ఓ రేంజ్ లో అఖిల్ పై విరుచుకు పడ్డాడు మెహబూబ్...

ఇక టాస్క్ విషయానికొస్తే చివరికి మంచి మనుషుల టీమ్ గెలించింది. బిగ్ బాస్ వారిని అభినందించి తరువాత ఈ టాస్క్ లో ఎవరు  వరెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసారో చెప్పాలంటూ కెప్టెన్ నోయల్ ని అడుగగా మాకు చుక్కలు చూపించిన అరియనా ఇంకా అవినాష్ పేర్లు చెప్పాడు నోయల్...అయితే ఊహించని విధంగా వారిద్దరినీ డైరెక్ట్ గా కెప్టెన్సీ టాస్క్ కి ఎంపిక చేశారు బిగ్ బాస్. 

మరింత సమాచారం తెలుసుకోండి: