నిన్న బిగ్ బాస్ హౌజ్ లో ఇంటి సభ్యుల మధ్య వివాదాలు ఇంకాస్త పెరిగి చివరికి ఒకరినొకరు ఫిజికల్ గా హార్ట్ చేసుకునే స్థాయికి వచ్చారు. మొన్నటి షో లో బిగ్ బాస్ కెప్టెన్సీ టాక్ లో భాగంగా... గెలిచేది ఎవరు రాజయ్యేది ఎవరు అనే టాస్క్ ను ఇవ్వగా...సన్ని, రవి లను రాజకుమారులుగా నియమించారు. ఆ టాస్క్ నిన్న కూడా కొనసాగింది. అయితే ఆ టాస్క్ లో బాగంగా బిగ్ బాస్ చిన్న చిన్న గేమ్ లు పెట్టగా...ఆ గేమ్స్ ఆడే సమయంలో శ్రీ రామ్ కి, జశ్వంత్ కి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇద్దరు ఒకరినొకరు నెట్టుకుంటూ గొడవకి దిగారు. జస్వంత్ వాంటెడ్ గానే పైన పడి మరీ కొడుతున్నాడని ఫైర్ అయ్యాడు శ్రీరామ్. నిజానికి ఈ ఇద్దరూ కూడా హౌస్ లో మొదటి నుండి వివాదాలకు కాస్త దూరంగా ఉంటారు.

అలాంటిది ఇప్పుడు వారిద్దరి మద్యే వివాదం చెలరేగి ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్లారు అంటే బిగ్ బాస్ నీళ్ళు బాగా వంటపడ్డాయని ఆ అంటున్నారు నెటిజన్లు. జస్వంత్ తీరుపై శ్రీ రామ్ కి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బోర్డు పై ఉన్న రవి ఫోటోలు తీసి కింద పడేసాడు. అంతే బిగ్ బాస్ షో లో ఎక్కువసేపు నటించడం కుదరదు..మనిషి అన్న తరువాత కోపం రాకుండా ఉండదు. మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా అది  ఎదో ఒక టైం లో బయటపడకుండా ఉండదు. అలాగే శ్రీ రామ్ చంద్ర మరియు జస్సి లు ఇప్పటి వరకు చాలా సాఫ్టు గా కనిపించినా వారికి కోపం వస్తుందని నిన్న ఆ రాజుల టాస్క్ వలన మాత్రమే బయటపడింది. ఇంతకీ ఇక్కడ శ్రీ రామ్ చంద్ర చాలా అతిగానే జెస్సీ పైన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు కనిపించింది.

జెస్సీ మాత్రం గేమ్ లో తన బలాన్ని చూపించాడు కానీ పెద్దగా ఆగ్రహానికి లోనవ లేదు. ఇక వీరిలో ఎవరికి శనివారం నాగ్ బాస్ దగ్గర తిట్లు పడనున్నాయి అంటే అందరూ చెబుతున్నా వినకుండా బిగ్ బాస్ ప్రాపర్టిని కిందకి తోసేసి ఫోటోలు కిందకి పడేసిన శ్రీ రామ్ కే అంటున్నారు. మరి ఏమౌతుందో చూడాలి. అయితే జస్వంత్ కూడా సిరి షణ్ముఖ్ లతో కలిసి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: