నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ లో చెప్పుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ముందుగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇంటి సభ్యులంతా కలసి కాజల్ ని కార్నర్ చేయడం. మాములుగా బిగ్ బాస్ హౌస్‌లో బెస్ట్‌ ఇంకా వరస్ట్‌ పర్ఫామర్లను చెప్పమని అడుగుతారు. దాని ప్రకారం ఇంటి సభ్యులు వారి వారి అభిప్రాయాన్ని తెలుపుతారు. అయితే నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం బిగ్ బాస్ బెస్ట్‌గా ఆడిన వాళ్లను విషయాన్ని అటుంచి ఎవరు వరస్ట్ గా ఆడారో తమ అభిప్రాయాన్ని ఒక్కొక్కరిగా తెలపాలని ఆదేశించాడు. ఈ క్రమంలో కాజల్ ను టార్గెట్ చేస్తూ ఎక్కువ మంది ఇంటి సభ్యులు ఆమెను వరెస్ట్ పర్ఫార్మర్ అంటూ పేరు పెట్టేసారు.

శ్వేత, హమీద, శ్రీ రామ్, లోబో, యాని మాస్టర్ , యాంకర్ రవి, విశ్వ ఇలా దాదాపుగా అందరూ కాజల్ నే వరెస్ట్ పర్ఫార్మర్ గా తెలిపారు. దాంతో కాజల్ కూడా ఇంత మంది దండయాత్ర చేయడం ఏం బాగోలేదు అంటూ ఎమోషనల్ అయ్యింది. ఈ విషయం అలా ఉంచితే ప్రియాంక సింగ్ కి మానస్ కి మధ్య ఒక చిన్న గొడవ జరిగింది. మొదటి నుండి ప్రియాంక కి మానస్ మీద కాస్త ఇంట్రెస్ట్ ఉందని తెలిసిందే. ఓ సారి ప్రియాంక మాట్లాడుతూ నేను హౌస్ లో ఎవరికైనా రాఖీ కడతాను. కానీ నీకు మాత్రం అసలు కట్టను అంటూ మానస్ కు చెప్పింది.

ఇక నిన్నేమో ప్రియ ఈ వారం బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ కాగా.. కెప్టెన్సీ టాస్క్ లో మాకు సపోర్ట్ చేయలేదంటూ తెగ ఫీల్ అయ్యారు సన్ని, మానస్. అంతేకాదు మానస్ అయితే ఏడ్చేశాడు కూడా. దాంతో ప్రియాంక గోరు ముద్దలు కలిపి మానస్ కి నచ్చ చెప్పి అన్నం తిని పెంచడానికి ప్రయత్నించగా.. మానస్ పింకీతో కటువుగా మాట్లాడటంతో ఆమె కూడా ఏడ్చేసింది. తనని అర్దం చేసుకోలేదని ఫీల్ అయినట్లుంది పింకీ. మరి తర్వాత అయిన ఫీల్ అయిన పింకీని మానస్ ఓదారుస్తాడేమో చూడాలి. వీరి మధ్య ఏదో తెలియని ప్రేమ బంధం పెనవేసుకుపోతోంది. మరి ముందు రోజుల్లో ఏమి జరగనుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: