ప్రేక్షకులు ఎక్కువగా సినిమాల కన్నా కూడా సీరియల్ అంటేనే ఇష్టంగా చూస్తూ ఉంటారు. ఏదో మన కుటుంబంలో జరుగుతున్నట్లు అనుభూతి చెందుతారు. గతంలో జెమిని టీవీలో ప్రసారం అయిన మొగలి రేకులు సీరియల్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్ వందల ఎపిసోడ్ లు ప్రసారం అయి రికార్డు సృష్టించింది. ఈ సీరియల్ కు ప్రేక్షకులు చాలా కనెక్ట్ అయ్యారు. ఇందులో నటించిన నటీనటులు సైతం అంతే ఫేమస్ అయ్యారు. అయితే తాజాగా ఈ సీరియల్ లో నటించిన నటుడు పవిత్ర నాథ్ గురించి ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. దీనితో ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే అసలు విషయం ఏమిటో ఒకసారి చూద్దాం.

స్వయంగా పవిత్ర నాథ్ భార్య శశి రేఖ పలు కీలక విషయాలను బయట పెట్టింది. ప్రస్తుతం ఇది సంచలనంగా మారుతోంది. ముఖ్యంగా ఇతగాడికి ఉన్న అక్రమ సంబంధాలను మీడియాతో తెలియచేయడం షాక్ అని చెప్పాలి. ఈమె మీడియా ముందు భర్త గురించి చెడుగా చెబుతోంది అంటే అతని వల్ల ఎంతలా బాధపడిందో అర్థం చేసుకోవచ్చు. ఇతనికి ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎంతో మందితో మహిళలతో అక్రమ సంబంధాలు  కలిగి ఉన్నాడని తెలిపింది శశిరేఖ. అయితే ఇతని వలలో మహిళలు ఎలా పడుతున్నారో కూడా ఈమె వివరించింది. పవిత్ర నాథ్ కు జాతకాలు చెప్పడంలో పరిజ్ఞానం ఉన్నందున, ఆ వంకతో మహిళలను బెడ్ రూం కు తీసుకు వచ్చి, నా ముందు  వారితో శృంగారంలో పాల్గొంటాడని తెలిపింది.

ఇదే విధంగా ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకుని 10 సంవత్సరాల తర్వాత వదిలేశాడని చెప్పింది. ఈ విషయం గురించి అత్తా మామలకు చెప్పినా వారు ఈమె పట్టించుకోకపోగా నన్నే తిట్టారు. అందుకే ఇక లాభం లేదనుకుని ఇలా మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపింది. అయితే ఇవన్నీ చూస్తూ ఉండలేక విడాకులు అడిగితే ఇవ్వకుండా చిత్ర హింసలు పెడుతున్నాడని నా భర్త నుండి నన్ను కాపాడాలని శశిరేఖ మీడియా ముఖంగా తన గోడును చెప్పుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: