స్వయంగా పవిత్ర నాథ్ భార్య శశి రేఖ పలు కీలక విషయాలను బయట పెట్టింది. ప్రస్తుతం ఇది సంచలనంగా మారుతోంది. ముఖ్యంగా ఇతగాడికి ఉన్న అక్రమ సంబంధాలను మీడియాతో తెలియచేయడం షాక్ అని చెప్పాలి. ఈమె మీడియా ముందు భర్త గురించి చెడుగా చెబుతోంది అంటే అతని వల్ల ఎంతలా బాధపడిందో అర్థం చేసుకోవచ్చు. ఇతనికి ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎంతో మందితో మహిళలతో అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడని తెలిపింది శశిరేఖ. అయితే ఇతని వలలో మహిళలు ఎలా పడుతున్నారో కూడా ఈమె వివరించింది. పవిత్ర నాథ్ కు జాతకాలు చెప్పడంలో పరిజ్ఞానం ఉన్నందున, ఆ వంకతో మహిళలను బెడ్ రూం కు తీసుకు వచ్చి, నా ముందు వారితో శృంగారంలో పాల్గొంటాడని తెలిపింది.
ఇదే విధంగా ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకుని 10 సంవత్సరాల తర్వాత వదిలేశాడని చెప్పింది. ఈ విషయం గురించి అత్తా మామలకు చెప్పినా వారు ఈమె పట్టించుకోకపోగా నన్నే తిట్టారు. అందుకే ఇక లాభం లేదనుకుని ఇలా మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపింది. అయితే ఇవన్నీ చూస్తూ ఉండలేక విడాకులు అడిగితే ఇవ్వకుండా చిత్ర హింసలు పెడుతున్నాడని నా భర్త నుండి నన్ను కాపాడాలని శశిరేఖ మీడియా ముఖంగా తన గోడును చెప్పుకుంది.