బిగ్ బాస్ షో చూస్తుండగానే 13 వారాలు గడిచిపోయాయి. తాజాగా 14వ వారంలోకి లోకి అడుగుపెట్టింది. సీజన్ ఫైవ్ లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు రాగా ఇపుడు కేవలం ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. మానస్, సన్నీ, షన్ను, సిరి, శ్రీరామ్ మరియు కాజల్ లు మాత్రమే హౌజ్ లో ఉండగా వీరిలో మరొకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లనున్నారు. శ్రీ రామ్ కి ఎలాగో టికెట్ టు ఫినాలే ఉంది. కాబట్టి అతడు టాప్ ఫైవ్ లోకి ఆల్రెడీ చేరిపోగా మిగిలిన ఆ నలుగురు ఎవరో చూడాలి. ఇదిలా ఉండగా నిన్నటి ఎపిసోడ్ లో ఇల్లంతా సందడితో నిండిపోయింది. హౌజ్ లో ఇంటి సభ్యులు చేసిన కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

నిన్నటి ఎపిసోడ్ లో బాయ్స్ రోల్స్ గర్ల్స్... గర్ల్స్ రోల్స్ బాయ్స్ చేయాలని టాస్క్ రాగా...ఒక్కొక్కరు మామూలుగా అల్లరి చేయలేదు అదరగొట్టేశారు అంతే. ఇక సన్ని అయితే ప్రత్యేకించి అందరిలోనూ స్పెషల్ గా ఎంటర్టైన్ చేసి ఆడియన్స్ కడుపుబ్బ నవ్వించారు. శ్రీ రామ్ పాత్రలో సిరి, సిరి పాత్రలో షన్ను , షన్ను పాత్రలో సన్ని ఇలా గెటప్ లు మార్చుకొని వారిలా నటిస్తూ రచ్చ రచ్చ చేసి ప్రేక్షకులను బలే నవ్వించేసారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ఈరోజు ఎపిసోడ్ ప్రోమో చూపించగా...అందులో షన్ను, సిరిపై మామూలుగా ఫైర్ అవ్వలేదు.

అస్సలు నువ్వు ఎపుడు ఫ్రెండ్ కి సపోర్ట్ చేయవు, టాస్క్ అని మాకు తెలీదా.., నువ్వేంటి నాకు చెప్పేది, నువ్వు ఎవరు చెప్పడానికి అంటూ సిరి పై  ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. మరి ఈ గొడవ ఎందుకు వచ్చింది. అసలు సిరికి షన్ను లకు మధ్య గొడవ ఏమయ్యింది అనేది నేటి ఎపిసోడ్ లో తెలియనుంది. అయితే రాను రాను ఫినాలే దగ్గర పడుతుండడంతో షన్ను కావాలని సిరిని దూరం పెడుతున్నాడు అని అంతా అనుకుంటున్నారు. టైటిల్ కొట్టాలంటే ఏ బంధం అడ్డు కాకూడదు అనే ఫార్ములాతో ఇలా చేస్తున్నాడా అని అంటున్నారు. మరి చివరికి ఏమి జరగనుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: