బుల్లితెరపై నాగిని సీరియల్ లో నటించిన మౌని రాయ్ గురించి మనందరికీ తెలిసిందే.. అయితే ఇప్పుడు తాజాగా ఇందులో తేజస్విని ప్రకాష్ నటిస్తోంది. దీంతో ఈమెకు బుల్లితెరపై మరింత క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియా కూడా చురుగ్గా కనిపిస్తూ తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ ఉంటుంది. అయితే ఈమె గురించి కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.తేజస్విని ప్రకాష్ 1993 లో 11న సౌదీఅరేబియాలో జన్మించినది. ఈమె తన చదువును మొత్తం ముంబై యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ చదివినది. బుల్లి తెరపై మాత్రం 2012వ సంవత్సరంలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అటు తర్వాత పలు నాటికలు లో నటించేందుకు ఈమెకు అవకాశాలు రావడం జరిగింది. ఇక వీటితో పాటుగా పలు రియాలిటీ షోలలో కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ -15 లో విజేతగా నిలిచింది ఈ ముద్దుగుమ్మ. అప్పుడప్పుడు తనకు సంబంధించిన కొన్ని డాన్స్ వీడియో లను కూడా షేర్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్య పరిచేలా ఉంటుంది తేజస్విని ప్రకాష్.ఈమె సోషల్ మీడియాలో ఏదైనా విషయాన్ని పోస్ట్ చేసింది అంటే చాలు రూ.15 లక్షల రూపాయల వరకు తీసుకుంటుంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా నాగిని-6 సీరియల్స్ లో ఒక ఎపిసోడ్ కు ఇమే రూ.2 లక్షల రూపాయల వరకు పారితోషకం అందుకుంటుంది. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు సైతం ఆశ్చర్యపోతున్నారు. కేవలం బుల్లితెర నటి అయ్యింది కూడా ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటుందా అంటూ ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఇక రాబోయే రోజులలో వెండితెరపై కూడా కనిపించే అవకాశం ఉండబోతోంది అన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం తెలుగులో కూడా నాగిని సీరియల్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో ముందుకు దూసుకు వెళుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: