తెలుగులో నాగిని సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి మౌని రాయ్ గురించి చెప్పాల్సిన పనిలేదు మొదట పలు రకాల టీవీ సీరియల్స్ లో నటించిన ఆ తర్వాత వెండితెర పైన పలు విభిన్నమైన పాత్రలలో నటించింది. అందానికి అందం అభినయం ఉన్నప్పటికీ కూడా మౌని రాయ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకోలేకపోయింది. తాజాగా ఈమె నటించిన "మూవీ భూతి" సినిమా మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మౌని రాయ్ తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని తెలియజేసింది.



ఒకసారి ఒక ఊరికి వెళ్ళామని ఎవరో తాను ఉన్న హోటల్ రూమ్ తాళం దొంగలించి అర్ధరాత్రి ఆ తాలాన్ని ఉపయోగించి తన రూములోకి రావాలని చాలా ప్రయత్నం చేశారని అయితే ఆ సమయంలో తన మేనేజర్ తో కలిసి తాను గదిలో ఉన్నానని మొదట ఈ విషయం పైన  షాక్ అయినప్పటికీ కూడా ఆ తర్వాత గట్టిగా ఆరిచామని అయితే ఈ సంఘటన గురించి హోటల్ రిసెప్షన్ ని గట్టిగా అడిగితే హౌస్ కీపింగ్ వాళ్ళు అయ్యి ఉంటారని చెప్పారట. కానీ అర్ధరాత్రి 12:30 నిమిషాల సమయంలో హౌస్కీపింగ్ కి ఏంటి అంటూ గట్టిగా అడిగేసానని తెలిపింది.


అయితే ఈ సంఘటన తనకి చాలా భయంకరమైన అనుభవాన్ని కలిగించిందని ఆరోజు అంతా కూడా తాను నిద్రపోలేదని తెలియజేసింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు అన్ని విషయాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నానని తెలిపింది మౌని రాయ్. ఈ అమ్మడు వ్యక్తిగత విషయానికి వస్తే 2022లో సూరజ్ నంబియార్ అనే కేరళ బిజినెస్ మాన్ ని వివాహం చేసుకున్నది. ఇక నిరంతరం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో హార్ట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. తన ఫాలోవర్స్ ని సైతం పెంచుకోవడంలో మౌని రాయ్ దిట్ట అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: