నీటి వనరుల్ని సరైన రీతిలో ఉపయోగించుకోలేక పోవడం వల్ల మన దేశంలో దాదాపు రెండు లక్షల గ్రామాలు దారుణమైన కరవును ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం- దేశంలోని భూగర్భజలాల్లో 70 శాతం నీటిని రైతులు వ్యవసాయానికే వాడుతున్నారు.
ఇవీ వాన నీటి లెక్కలు
ఈరోజు 20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది, 30 మి. మీ లేదా 50 మి. మీ. వర్షం కురిసింది అని వార్తా పత్రికలలో చదువుతుంటాము దీని అర్థం ఏమిటి?
ఈరోజు 20 మి. మీ వర్షం కురిసింది అంటే ఆ ప్రాంతంలో ఒక చదరపు మీటర్ మీద 20 లీ.. వర్షపు నీరు పడిందని లెక్క. లేదా 40 మిల్లీమీటర్ల వర్షం కురిసింది అంటే ఒక చదరపు మీటర్ మీద 40 లీటర్ల వర్షపు నీరు పడిందని లెక్క.
2030 సంవత్సరం నాటికి భారతదేశంలో 40 % పల్లెల్లో, పట్టణాలలో త్రాగునీరు దొరకదు అని ఇప్పటికే శాస్త్రజ్ఞులు అంటున్నారు... జాగ్రత్త పడండి, వర్షపు నీటిని ఒడిసి పట్టడం నేర్చుకోండి.
భూగర్భజలాల వాడకంలో చైనా, అమెరికాల వాడకాన్ని కలిపినా కూడా మనదే ఎక్కువ. దీనిక్కారణం హరితవిప్లవమే. వరి, చెరకు, గోధుమల్ని ఎక్కువగా పండించడం వల్లే నీటి వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇదిలాగే కొనసాగితే బంగారు బాతు గుడ్డు కథ నిజం కావడానికి ఎంతోకాలం పట్టదన్న విషయాన్ని గుర్తించారు తెలంగాణ రైతులు. ఎండిన బోర్లకు ఎలా జీవం పోస్తున్నారో ఈ వీడియో లింక్ చూడండి.https://youtu.be/jzvM_p5bf9s
">" frameborder="0" allow="accelerometer; autoplay; encrypted-media; gyroscope; picture-in-picture" allowfullscreen>
....................
https://youtu.be/jzvM_p5bf9s