స్మార్ట్ఫోన్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది మోటోరోలా. ప్రస్తుతం కరోనా టైమ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా మోటోరోలా తమ కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. మోటోరోలా జీ8 సిరీస్లో మోటోరోలా జీ8 పవర్ లైట్ స్మార్ట్ఫోన్ పేరుతో తాజాగా ప్రపంచానికి పరిచయం చేసింది.
జీ8 పవర్ లైట్ స్మార్ట్ఫోన్ లో 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇక ఈ స్మార్ట్ఫోన్ ధర సుమారు రూ.14,000 ఉంటుంది. అయితే ప్రస్తుతం మెక్సికో, జర్మనీలో ఈ స్మార్ట్ఫోన్ సేల్ ప్రారంభం అవ్వనుంది. ఆ తర్వాత లాటిన్ అమెరికా, ఆసియా, యూరప్, ఆస్ట్రేలియా మార్కెట్లకు రానుంది. అలాగే ఈ స్మార్ట్ఫోన్ ఆర్కిటిక్స్ బ్లూ, రాయల్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే..
- 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే
- 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 4 జీబీ ర్యామ్
- 16+2+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
- 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ
- మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్
- ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్
- డ్యూయెల్ సిమ్ సపోర్ట్