నేటి కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ కామన్గా ఉంటుంది. కాస్త సమయం దొరికిందంటే చాలు ప్రతి ఒక్కరు టీవీకి అతుక్కుపోతున్నారు. ఈ క్రమంలోనే టీవీలకు భారీ డిమాండ్ పెరిగిపోయింది. ఇక డిమాండ్ కు తగ్గట్టుగానే.. వివిధ కంపెనీలు తక్కువ ధరలకే టీవీలను అందుబాటులోకి తీసుకువస్తూ జనాలను ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ తాజాగా సరికొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది.
ది ఫ్రేమ్ 2020 పేరుతో లైఫ్స్టైల్ టీవీతో పాటు 10 కొత్త స్మార్ట్ టీవీ మోడల్స్ని పరిచయం చేసింది సాంసంగ్. ఈ టీవీలు పర్సనల్ కంప్యూటర్ మోడ్తో కూడా వస్తాయి, వినియోగదారులు తమ టీవీని పూర్తి స్థాయి పీసీగా వాడుకోవచ్చు. దీనితో వర్క్ ఫ్రం హోం వినియోగదారులకు సౌలభ్యం, పెద్ద స్క్రీన్ సౌలభ్యం కోసం ఇంటర్నెట్ లేకుండా వైర్లెస్గా ల్యాప్టాప్ను మిర్రర్ చేసుకోవచ్చు. లేదా రిమోట్గా వారి కార్యాలయ కంప్యూటర్ను యాక్సెస్ చేయవచ్చు. అలాగే ఆటో హాట్స్పాట్ టెక్నాలజీ, యుఎస్బి 3.0, శాంసంగ్ బిక్స్బైతో పాటు గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వంటి వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లను వీటిల్లో ఉన్నాయి.
ఈ స్మార్ట్ టీవీల ప్రారంభ ధర రూ.14,490. జూన్ 19 అర్థరాత్రి ఫ్లిప్కార్ట్, అమెజాన్తో పాటు సాంసంగ్ అధికారిక వెబ్సైట్లో సేల్ ప్రారంభమవుతుంది. అలాగే ఫ్లిప్కార్ట్లో మొదటి 48 గంటల్లో ప్రీపెయిడ్ ద్వారా ది ఫ్రేమ్, స్మార్ట్ టీవీలను క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డులతో కొనేవారికి రూ.1,500 క్యాష్బ్యాక్ అందిస్తోంది సాంసంగ్. అమెజాన్లో ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో ప్రీపెయిడ్ ద్వారా కొంటే రూ.1,000 క్యాష్బ్యాక్ లభిస్తుంది. ఇక సాంసంగ్ కొత్తగా రిలీజ్ చేసిన టీవీల ధరలు చూస్తే.. హెచ్డీ రెడీ స్మార్ట్ టీవీ (32 అంగుళాలు)- రూ.14,490, ఫుల్ హెచ్డీ స్మార్ట్ టీవీ (43 అంగుళాలు)- రూ.31,990, 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ టీవీ (43 అంగుళాలు)- రూ.36,990, 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ టీవీ (65 అంగుళాలు)- రూ.89,990, ది ఫ్రేమ్ 2020 టీవీ (50 అంగుళాలు)- రూ.74,990, ది ఫ్రేమ్ 2020 టీవీ (55 అంగుళాలు)- రూ.84,990 మరియు ది ఫ్రేమ్ 2020 టీవీ (65 అంగుళాలు)- రూ.1,39,990గా నిర్ణయించారు.