చంద్రుడిపై ఆ ధనవంతుడు స్థలం కొన్నాడంట.. చంద్రుడిపై ఈ కుబేరుడు ఇల్లు కూడా కట్టబోతున్నాడంట. మనమందరం చిన్ననాటి నుంచి వింటూ వస్తున్న వార్తలివి. నిజం చెప్పాలంటే.. చంద్రుడిపై ఇప్పటివరకు అనేక మంది భూమిని కొనుగోలు చేశారు. షారూఖ్ ఖాన్ వంటి దిగ్గజ నటులు కూడా ఈ భూములు కొన్న వారిలో ఉండటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా బాగా డబ్బులెక్కువైపోయిన వారు తమ భార్యకో, గర్ల్ ఫ్రెండ్‌కో గిఫ్ట్ అంటూ చంద్రుడిపై స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగింది. సెలబ్రిటీలు, కుబేరులు చంద్రుడిపై భూమి కొనుగోలు చేశారు అనే వరకు మాత్రమే మనకు తెలుసు. కానీ.. చంద్రుడిపై భూమి కొన్నంత మాత్రాన నిజంగా అక్కడి స్థలం వీరి సొంతమవుతుందా? వీరు ఏ స్థలం అయితే కొన్నారో అదంతా వీరికే దక్కుతుందా? చాలా మందికి వచ్చే డౌట్ ఇదే.

నిజానికి చంద్రుడిపై స్థలం కొనే హక్కు ఏ ఒక్కరికి లేదని నిపుణులు చెబుతున్నారు. మరి వీరంతా అక్కడ స్థలం కొనేది ఎందుకు? చంద్రుడిపై వీరికి ఏ హక్కు లేకపోతే కోట్లకు కోట్లు వెచ్చించి ఎందుకు ఈ విధంగా వేరే చోట స్థలం కొంటున్నారనే డౌట్ మీకు రావచ్చు. మనిషి ఎప్పుడైతే అంతరిక్ష యాత్రలు ప్రారంభించాడో అప్పుడే ప్రపంచదేశాలకు ఇలాంటి సందేహాలు వచ్చేశాయి. అంతరిక్ష యాత్రలు సక్సెస్ అయితే వేరే గ్రహాలపై కూడా ఆధిపత్యం రావొచ్చని ముందుగానే ఊహించారు. వీరందరికి అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచదేశాలన్ని 1967 ఓ కీలక ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఆ ఒప్పందం పేరు ఔటర్ స్పేస్ ట్రీటీ.

అంటే.. అంతరిక్షంలోని వనరులన్నీ మానవ కళ్యాణం కోసం ఉద్దేశించినవి కానీ.. అక్కడ స్థలాలు మాకే సొంతం అంటూ ఏ దేశం కానీ లేదా ఏ సంస్థ కానీ, మనుషులు కాని ప్రకటించుకునే హక్కు ఉండదు. ఈ ఒప్పందంపై భారత్ కూడా సంతకం చేసింది. అయితే చంద్రుడిపై భూమి కొన్న వారి పేర్లను లూనార్ రిజిస్ట్రీలో చేర్చుతారు. ఇదో జాబితా అని చెప్పాలి. ప్రైవేటు సంస్థలు లేదా వ్యక్తుల ప్రోత్సాహంతో మనుషులు మరోసారి చంద్రుడిపై అడుగుపెట్టేలా చేయడమే లూనార్ రిజిస్ట్రీ చేసే పని. అంటే.. చంద్రుడిపై భూమి కొన్నామని చెప్పుకున్నా నిజంగా అందుకు సంబంధించి వారికి ఎటువంటి పత్రాలు ఇవ్వరన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: