పియాజియో ఇండియా ఇండియా మార్కెట్లో ఎట్టకేలకు తన కొత్త వెస్పా 75 వ యానివర్సరీ ఎడిషన్‌ ను విడుదల చేయడం జరిగింది. ఇండియా మార్కెట్లో విడుదలైన ఈ కొత్త వెస్పా స్కూటర్ ధర వచ్చేసి రూ.1.25 లక్షలతో ప్రారంభించింది. ఇక ఈ స్కూటర్ బుకింగ్స్ ఇప్పటికి ప్రారంభించబడ్డాయి.ఇవి కొనుగోలుచేయదలచిన కస్టమర్లు ఆన్‌లైన్‌లో ఇంకా కంపెనీ అధికారిక డీలర్‌షిప్‌లలో రూ. 5,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి వీటిని బుక్ చేసుకోవచ్చు.ఇక వీటి డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.ఇక ఈ కొత్త "Vespa 75th Anniversary Edition" స్కూటర్ వచ్చేసి రెండు వేరియంట్లలో మనకు అందుబాటులో ఉంటుంది. అవి Vespa 75th Anniversary Edition 125 ఇంకా Vespa 75th Anniversary Edition 150 వేరియంట్లు. ఇక వీటి ధరల విషయానికి వస్తే..రూ. 1.25 లక్షలు ఇంకా రూ. 1.39 లక్షలు.ఇండియా మార్కెట్లో అడుగుపెట్టినా ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌లో కంపెనీ అనేక మార్పులు చేయడం జరిగింది.

ఇక స్కూటర్ కొత్త మెటాలిక్ ఎల్లో కలర్ లో చాలా స్టైలిష్ గా ఉంది.ఇక దీనితో పాటు ఈ స్కూటర్ లోని సైడ్ ఆప్రాన్ ఇంకా మడ్‌గార్డ్‌పై 75 నెంబర్ మనం చూడవచ్చు.ఇక ఇది 75 వ వార్షికోత్సవాన్ని తెలుపుతుంది.అలాగే దీనికి లైట్ గ్రే కలర్ లో ఫినిషింగ్ ఉంది.ఇక అంతే కాకూండా క్రోమ్‌తో 75 యానివర్సరీ ఎడిషన్‌ అని చెక్కబడి ఫలకం కూడా ఉంది.ఇది స్కూటర్  ముందు స్టోరేజ్ కంపార్ట్‌మెంట్‌లో మనం చూడవచ్చు.ఇక ఈ కొత్త Vespa 75th Anniversary Edition స్కూటర్ లో గమనించదగ్గ మార్పు ఏంటంటే.. అది ఇందులోని రౌండ్ ఆకారపు బ్యాగ్‌.పాత మోడల్స్ లో ఈ ప్రాతంలో ఒక విడి టైర్ ఉండేది. ఇది నోబుక్ లెదర్‌లో ఫినిష్ చేశారు.ఇక అది క్రోమ్ ర్యాక్‌లో ఉంటుంది. మొత్తానికి ఇది చూడటానికి చాలా సింపుల్ గా ఇంకా ఎంతో స్టైలిష్ గా ఉంటుంది.ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి వున్నవారు ఈ సరికొత్త స్టైలిష్ స్కూటర్ ని ఇప్పుడే బుక్ చేసుకోండి.ఈ స్కూటర్ ని సొంతం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: