కొంతమంది ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కానీ వెంటనే వారు మెడికల్‌ షాప్‌కు పరిగెత్తుతారు. సొంత వైద్యాన్ని అప్లై చేసి తమకి ఇష్టం వచ్చినట్లుగా ట్యాబ్లెట్లని వేసుకుంటుంటారు.పెయిన్‌ కిల్లర్స్‌ మొదలు ఇంకా యాంటీబయాటిక్స్‌ను కూడా అసలు ఎడాపెడ వాడేస్తుంటారు. నిజానికి ఏ చిన్న ట్యాబ్లెట్‌ అయినా కూడా ఖచ్చితంగా డాక్టర్‌ సూచనమేరకే తీసుకోవాలి. లేదంటే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా యాంటీబయాటిక్స్‌ వాడితే రోగనిరోధ వ్యవస్థలో లోపాలు ఏర్పాడుతాయని ఇంకా బ్యాక్టీరియాకు మందులను తట్టుకునే శక్తి వస్తుంది. దీంతో మున్ముందు మందులు కూడా పనిచేయవు. మరింత శక్తిమంతమైన మందులు అవసరమవుతాయని ఆరోగ్యం నిపుణులు చెబుతారు. అయితే తాజాగా శాస్త్రవేత్తల పరిశోధనల్లో మరో షాకింగ్‌ విషయం ఒకటి వెల్లడైంది.యాంటీబయాటిక్స్‌ను కనుక అతిగా వాడితే ప్రమాదకరమైన ఫంగల్‌ వ్యాధులు సోకే ప్రమాదం పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. కాండిడా అనే ఫంగస్‌ కారణంగా ప్రమాదకరమైన ఇన్వాసివ్‌ కాండిడియాసిస్‌ అనేది సోకే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.



ఇక యూనివర్సిటీ ఆఫ్‌ బిర్మింగ్‌హామ్‌ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. యాంటీబయాటిక్స్‌ను ఎక్కువగా వాడడం వల్ల జీర్ణవాహికలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియా నశిస్తాయి. దీంతో ఈ మంచి బ్యాక్టీరియా స్థానంలో కాండిడా వంటి ఫంగస్‌ చేరుతాయని పరిశోధనల్లో తేల్చి చెప్పారు.ఇక ఇందులో భాగంగా పరిశోధకులు ఎలుకలపై కూడా పరిశోధనలు నిర్వహించారు. ముందుగా కొన్ని ఎలుకలకు యాంటీబయాటిక్స్‌ మిశ్రమాన్ని వారు అందించారు. తర్వాత వాటికి కాండిడా ఫంగస్‌ను కూడా ఎక్కించారు. ఇక మరికొన్ని ఎలుకలకు కూడా యాంటీబయాటిక్స్‌ ఇవ్వకుండానే ఫంగస్‌ను ఎక్కించారు. కొద్ది సమయం తర్వాత యాంటీబయాటిక్స్‌ వాడిన ఎలుకల్లో ఫంగస్‌ ఎక్కువ ఇన్‌ఫెక్షన్‌ కలిగించనట్లు వారు గుర్తించారు. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించే సైటోకైన్స్‌ అనే ప్రోటీన్ల ఉత్పత్తిపై యాంటీబయాటిక్స్‌ అనేది చాలా తీవ్ర ప్రభావం చూపినట్లు పరిశోధకులు గుర్తించారు.అయితే ఇక ఈ సమస్యకు చెక్‌ పెట్టాలేమా అంటే దానికి పరిశోధకులు ఓ ఉపయాన్ని కూడా కనుగొన్నారు. సైటోకైన్స్‌ను విడిగా ఔషధ రూపంలో అందిస్తే యాంటీబయాటిక్‌ చాలా ఎక్కువగా వాడడం వల్ల వ్యాధులు సోకిన వారిలో మెరుగుదల ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: