ఏప్రిల్ నెలలో, ఓలా ఎలక్ట్రిక్ 1441యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్ని రీకాల్ చేయడం జరిగింది. అలాగే బూమ్ మోటార్స్ ఏప్రిల్ నెల చివరి వారంలో కార్బెట్ బైక్స్ బ్రాండ్తో విక్రయించిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కూడా రీకాల్ చేసింది, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పేలుడు సంభవించి ఒక 40 ఏళ్ల వ్యక్తి మరణించాడు. అలాగే తెలంగాణలోని నిజామాబాద్లో ప్యూర్ ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలుడు కారణంగా 80 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఇక సుమారు 2,000 స్కూటర్లను రీకాల్ చేసింది. ఇదిలా ఉంటే టాటా నెక్సాన్ ఈవీ ప్రమాదం వీడియోను సోషల్ మీడియా ద్వారా చేసిన ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలను చేశారు. ఈవీ ప్రమాదాలు బాగా జరుగుతాయి. అన్ని అంతర్జాతీయ ఉత్పత్తుల్లో కూడా అగ్నిప్రమాదాలు జరుగుతాయి. కానీ ఐసీఈ ప్రమాదాలతో పోలిస్తే ఈవీల్లో తక్కువని ఆయన తెలిపారు.
ఏప్రిల్ నెలలో, ఓలా ఎలక్ట్రిక్ 1441యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్ని రీకాల్ చేయడం జరిగింది. అలాగే బూమ్ మోటార్స్ ఏప్రిల్ నెల చివరి వారంలో కార్బెట్ బైక్స్ బ్రాండ్తో విక్రయించిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కూడా రీకాల్ చేసింది, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పేలుడు సంభవించి ఒక 40 ఏళ్ల వ్యక్తి మరణించాడు. అలాగే తెలంగాణలోని నిజామాబాద్లో ప్యూర్ ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలుడు కారణంగా 80 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఇక సుమారు 2,000 స్కూటర్లను రీకాల్ చేసింది. ఇదిలా ఉంటే టాటా నెక్సాన్ ఈవీ ప్రమాదం వీడియోను సోషల్ మీడియా ద్వారా చేసిన ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలను చేశారు. ఈవీ ప్రమాదాలు బాగా జరుగుతాయి. అన్ని అంతర్జాతీయ ఉత్పత్తుల్లో కూడా అగ్నిప్రమాదాలు జరుగుతాయి. కానీ ఐసీఈ ప్రమాదాలతో పోలిస్తే ఈవీల్లో తక్కువని ఆయన తెలిపారు.