రిలయన్స్ జియో మరో సరికొత్త ప్రోడక్ట్ ను త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. అది కూడా సామాన్య ప్రజలకు, విద్యార్థులకు కూడా అందుబాటులో ఉండే విధంగా ల్యాప్ ట్యాప్ ను కేవలం రూ 15000 వేల రూపాయలకే ఈ ల్యాప్ ట్యాప్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. అది కూడా4 జి సిమ్ కార్డు ద్వారా నెట్ ను కనెక్ట్ చేసుకునే విధంగా సదుపాయంతో ఈ సరికొత్త ల్యాప్ ట్యాప్ ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ సంస్థ తీసుకు వస్తున్న ల్యాప్ ట్యాప్ ధర జియో ఫోన్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇలాంటి వాటిని మార్కెట్లకు తీసుకువస్తున్నామని రిలయన్స్ అధినేత తెలియజేయడం జరిగింది.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన వాటిలో క్వాల్ క్వామ్ సంస్థతోపాటు మైక్రోసాఫ్ట్ సంస్థతో రిలయన్స్ జియో సంస్థ ఒప్పందం చేసుకున్నట్లుగా సమాచారం దీని ద్వారా చౌకమైన ధరలకు విండోస్, ఓ ఎస్ ద్వారా చౌకమైన ధరలకే ల్యాప్ ట్యాప్ ను రూపొందించబోతున్నట్లు తెలియజేశారు. ముఖ్యంగా  ఈ ల్యాప్ ట్యాప్ విద్యార్థుల కోసం ప్రభుత్వ సంస్థల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే జీయో సంస్థ పలు టెక్నాలజీని ఉపయోగించుకొని పలు ప్రాడెక్టులను, 5g నెట్వర్క్ సంబంధించిన వాటిని త్వరలోనే విడుదల చేయబోతోంది


ఇక తాజాగా ఈ స్మార్ట్ ల్యాప్ ట్యాప్ ను మరో మూడు నెలలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ల్యాప్ ట్యాప్ ను జియో బుక్ అనే పేరుతో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది దీన్ని పూర్తిగా దేశంలోని తయారు చేస్తున్నట్లుగా ఆ సంస్థ తెలియజేశారు కనీసం 15% మార్కెట్ లక్ష్యంగా రిలయన్స్ దీనిని రూపొందిస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది. దీంతో సామాన్యు విద్యార్థులు సైతం ఈ ల్యాప్ ట్యాప్ ను ఉపయోగించుకునే విధంగా వీటిని తయారు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఎంతవరకు ఫీచర్లతో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: