ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ వైరల్ న్యూస్ చదవండి.. ఈ భూమ్మీద మంచి చెడు తెలిసిన జన్మ అంటూ ఉంటే అది మానవ జన్మే.. లోకంలో వున్న అన్ని జాతుల కంటే మానవ జాతే గొప్ప జాతి అని అంటుంటారు. నాగరికత తెలిసిన జాతి మానవ జాతి. అలాంటి ఈ గొప్ప జాతి కొంతమంది వల్ల తన విలువను పోగొట్టుకుంటుంది. మనుషులు ఇప్పుడు బాగా అప్‌డేట్ అయ్యారు. అనాగరికుల కంటే దారుణంగా మారిపోయారు. చిత్రహింసలను ఆస్వాదించే రాక్షసుల్లా మారిపోతున్నారు.ఈ భూమ్మీద తామే ప్రాణులమని అనుకుంటున్నారు. మిగతా ప్రాణులను హింసిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.  

ఇందుకు గుజరాత్‌లోని గిర్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనే నిదర్శనం. ఆ అటవీ ప్రాంతంలో సింహం సంచరిస్తుందనే విషయం తెలిసి ఇటీవల కొందరు కుక్కలను, కోళ్లను ఎరగా వేస్తున్నారు. ఈ సారి ఏకంగా ఆవునే ఎరగా వేసి.. సింహం వేటను కళ్లతో స్వయంగా చూడాలని అనుకున్నారు. ఊహించినట్లే సింహం నేరుగా ఆవు మీదకు దూకి చంపి తీనేసింది. బాధతో అల్లాడుతున్న ఆ ఆవును చూసి పైశాచిక ఆనందం పొందారు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.


ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆవును సింహానికి ఎగరగా వేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన కొందరు.. ఆ సింహం ఆవు మీదకు కాకుండా దాన్ని ఎరగానే వేసిన మనుషుల మీదకు వచ్చి ఉంటే వీడియో ఇంకా బాగుండేదని, అలాంటి దుర్మార్గులకు అదే తగిన శిక్ష అని అంటున్నారు. వీళ్ళు దీనికి 100 రెట్లు అనుభవిస్తారు. ఈ వీడియో చూసిన వారికి వారు దొరికితే చంపేయాలన్న కోపం వస్తుంది. మరి, ఈ వీడియో చూసి మీరేమంటారో చెప్పండి.ఇలాంటి వైరల్ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..


మరింత సమాచారం తెలుసుకోండి: