ఇందుకు గుజరాత్లోని గిర్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనే నిదర్శనం. ఆ అటవీ ప్రాంతంలో సింహం సంచరిస్తుందనే విషయం తెలిసి ఇటీవల కొందరు కుక్కలను, కోళ్లను ఎరగా వేస్తున్నారు. ఈ సారి ఏకంగా ఆవునే ఎరగా వేసి.. సింహం వేటను కళ్లతో స్వయంగా చూడాలని అనుకున్నారు. ఊహించినట్లే సింహం నేరుగా ఆవు మీదకు దూకి చంపి తీనేసింది. బాధతో అల్లాడుతున్న ఆ ఆవును చూసి పైశాచిక ఆనందం పొందారు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆవును సింహానికి ఎగరగా వేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన కొందరు.. ఆ సింహం ఆవు మీదకు కాకుండా దాన్ని ఎరగానే వేసిన మనుషుల మీదకు వచ్చి ఉంటే వీడియో ఇంకా బాగుండేదని, అలాంటి దుర్మార్గులకు అదే తగిన శిక్ష అని అంటున్నారు. వీళ్ళు దీనికి 100 రెట్లు అనుభవిస్తారు. ఈ వీడియో చూసిన వారికి వారు దొరికితే చంపేయాలన్న కోపం వస్తుంది. మరి, ఈ వీడియో చూసి మీరేమంటారో చెప్పండి.ఇలాంటి వైరల్ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..