‘ప్రపంచం నుంచి మనం అన్ని తీసుకుంటున్నాం. స్వేచ్ఛగా తిరిగే జంతువుల్ని తింటున్నాం. అడవుల్ని నరికేస్తున్నాం. అన్నింటిని నాశనం చేస్తున్నాం. కానీ.. తిరిగి ఏమీ ఇవ్వట్లేదు. అందుకే సింహాలకు ఆహారంగా అయినా ఉపయోగపడాలని ఉంది. నా డెడ్ బాడీని సింహాలు తింటుంటే.. అక్కడికి వచ్చే సందర్శకుల ముఖాల్లోని భావాల్ని చూడాలని ఉంది’’ అంటూ పేర్కొన్న మాటలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.జరుగుతున్న పరిణామాలు.. ప్రపంచంలోమనిషి తన బాధ్యతను అంతకంతకూ తగ్గించుకుంటూ పోతున్న తీరుపై తనకున్న అక్రోశాన్ని విభిన్నంగా రికీ అల చెప్పాడన్నమాట.తన మరణానంతరం శరీరం ఇలాగైనా ఉపయోగపడుతున్నందుకు సంతోషపడతానని పేర్కొన్నాడు రికి
అయితే ఆయన మాటలకు లండన్ లోని ప్రముఖ జూ స్పందించింది. రికీని తినటానికి తమ జూలోని సింహాలకు కష్టంగా ఉండొచ్చంటూ జూ నిర్వహణాధికారి సరదాగా వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ నేపథ్యంలో జూ నిర్వహణ బాధ్యత క్లిష్టంగా మారింది. నిధుల కొరత వెంటాడుతోంది.వరైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే విరాళాల రూపంలో ఇవ్వాలని, ఆ సొమ్ముతో ఆహారం కొనుగోలు చేసి సింహాలకు వేస్తామంది.