ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండేది అన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో అలాంటి ప్రత్యేకమైన ఆలయం లేకుండా పోయింది. ఇలాంటి నేపథ్యంలోనే తెలంగాణలో ఎంతో ప్రఖ్యాతి గాంచిన యాదాద్రి దేవస్థానం ని తెలంగాణ తిరుపతిగా అభివృద్ధి చేసేందుకు కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక యాదాద్రి అభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో అటు యాదాద్రి ఆలయం రూపురేఖలు మొత్తం మారిపోయాయి అని చెప్పాలి.


 ఇక దాదాపుగా యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు మొత్తం పూర్తయ్యాయి అదే చెప్పాలి. అయితే యాదాద్రి ఆలయం ఎంత సర్వాంగ సుందరంగా ముస్తాబు అయింది అన్న విషయాన్ని తెలిపే విధంగా ఇప్పటికే ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇక ఈ వీడియోలను చూసిన భక్తులందరూ కూడా మైమరచిపోయారు అనే చెప్పాలి. ఇక ఇప్పుడు తెలంగాణ తిరుపతిగా పేరుపొందిన యాదాద్రి ఆలయానికి సంబంధించిన మరో వీడియో కూడా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ వీడియోచూసి ఎంతో మంది ఇక త్వరలో యాదాద్రి ఆలయాన్ని సందర్శించాలి అని అనుకుంటున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 కాగా ప్రస్తుతం తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదాద్రి ఆలయం పునఃప్రారంభం కోసం ముస్తాబు అవుతోంది. 2022 మార్చి 28 వ తేదీన మహా కుంభ సంప్రోక్షణ జరిగిన తర్వాత భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు ఆలయ నిర్వాహకులు. అంతకు ఎనిమిది రోజుల ముందు మహా సుదర్శన హోమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక ఆలయానికి సంబంధించిన వీడియోను ఇటీవలే రాష్ట్ర పర్యాటక శాఖ సోషల్ మీడియాలో విడుదల చేసింది. డ్రోన్ కెమెరా లో తీసిన ఈ దృశ్యాలు భక్తులందరినీ కూడా కట్టిపడేస్తున్నాయి అనే చెప్పాలి. ఇక వినూత్నంగా తీర్చిదిద్దిన ఈ కమనీయమైన దృశ్యాలు అందరినీ మైమరపింప చేస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: