వివరాల్లొకి వెళితే..చెన్నైలోని అయ్యన్నవరం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తనను ఓ అగంతకుడు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని అయ్యన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు..అసలు విషయాన్నికొస్తే..వాట్సాప్ డీపీగా పెట్టుకున్నాడు. ఆ ఫొటోను ఓ సైబర్ కేటుగాడు డౌన్లోడ్ చేసి మార్ఫింగ్ చేశాడు. ఆమె మాములు ఫొటోను ఓ నగ్న ఫొటోగా మార్చేసి ఆమె భర్తను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అడిగినంత డబ్బు ఇవ్వాలని లేకపోతే ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. ఏం చేయాలో పాలుపోని ఆ భర్త పోలీసులను ఆశ్రయించాడు..
పోలీసులు అసలు విషయాన్ని లాగే ప్రయత్నం చేస్తున్నారు.సైబర్ క్రైమ్ డిపార్టుమెంట్ కు ఈ కేసును బదిలీ చేశారు.ఎవరో తెలిసిన వారే అతని భార్య ఫొటోను సేవ్ చేసుకుని ఇలా డబ్బు కోసం మార్ఫింగ్ చేసి బెదిరిస్తున్నారేమోనన్న కోణంలో కూడా పోలీసుల విచారణ సాగుతోంది. మహిళలనే కాదు వారి ఫొటోలు కనిపించినా ఆ ఫొటోలను ఇలా మార్ఫింగ్ చేసి వేధింపులకు గురిచేసే స్థాయికి పరిస్థితి దిగజారింది.. అందుకే ఎంత ప్రేమ వున్న ఇలా భార్యల ఫోటోలను సోషల్ మీడీయా పెట్ట కూడదు అని పోలీసులు హెచ్చరించారు.. ఈ ఘటన పై పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.