ఇటీవల కాలంలో సోషల్ మీడియా అనే మాయలో మునిగి తేలుతున్న నేటి తరం ప్రజానికం ఇక సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడానికి పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు అని చెప్పాలి. వెరసి సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం కోసం చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉండడం కూడా ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంది అని చెప్పాలి. మొన్నటికీ మొన్న మెట్రో ట్రైన్ లో ఒక యువకుడు..  ఏకంగా టవల్ కట్టుకొని టీషర్ట్ వేసుకొని వచ్చి అందరిని అవ్వక్కయ్యలా చేశాడు.


 ఇక ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది ఇంటర్నెట్ ను షేర్ చేసింది అన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో పాపులారిటీ అవ్వాలనుకోవడం బాగానే ఉంది. కానీ ఇలాంటి పిచ్చి పనులు ఏంటో అంటూ నెటిజెన్స్ ఈ వీడియో చూసి అభిప్రాయపడ్డారు. ఇక ఇప్పుడు అపర్ణ దేవ్యాల్ అనే ఒక మహిళ ఇలాంటి పనే చేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధారణంగా మెట్రో ట్రైన్ లో ప్రయాణించే ప్రయాణికులు ఎవరైనా సరే ఇక సీట్లో కూర్చొని మొబైల్లో మునిగిపోవడం లేదా తోటి ప్రయాణికులతో మాట్లాడటం లాంటివి చేస్తూ ఉంటారు.


 కాగా ఇక్కడ యువతి మాత్రం మెట్రో ట్రైన్ లో ప్రయాణిస్తూ ఏకంగా మధ్యలో హ్యాండ్ హోల్డింగ్స్ ని గట్టిగా పట్టుకొని ఇక అటు ఇటు ఊయల ఊగడం లాంటి వెక్కిలి చేష్టలు  చేసింది. అంతేకాదు సీట్లపై కూర్చుని బోర్డుపై తనను మోసుకెళ్లే మృదువైన బొమ్మతో ఫోజులు ఇవ్వడం లాంటివి చేసింది. ఇలా చిత్రవిచిత్రంగా ప్రవర్తించి ఇక ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఇంట్లో ప్లేస్ లేదా తల్లి ఏకంగా మెట్రోలోకి వచ్చి ఆడుకుంటున్నావ్ అంటూ కొంతమంది ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: