ఈ సమయంలోనే ఎన్నికల సంఘం తాజాగా స్పందిస్తూ ఏప్రిల్ 17న సీతారాముల కళ్యాణం ప్రత్యక్షంగా ప్రసారం చేసేందుకు కూడా అనుమతులను జారీ చేసింది.. ఈ రోజున సీతారాముల కళ్యాణం చాలా ఘనంగా ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. మిథిలా మండపాన్ని చాలా సుందరంగా ముస్తాబు చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో శ్రీరామనామ స్మరణంతో భద్రాచలం ఒక్కసారిగా మారుమోగుతోంది. ఈ కళ్యాణ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు దేవునికి సమర్పిస్తున్నారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆంక్షలు పాటిస్తూనే సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సీతారాముల కళ్యాణం చూడడానికి దేశంలోని ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉండడంతో ప్రత్యేక అర్చనలు,ఇతరత్రా దర్శనాల టికెట్లను కూడా ఆపివేసి ఉచిత దర్శనాన్ని కల్పిస్తున్నట్లు భద్రాచలం ఆలయ ఈసీ రమాదేవి వెల్లడించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అక్కడ అన్నదాన సదుపాయాన్ని కూడా కల్పించబోతున్నట్లు తెలుస్తోంది.