పావువా న్యూగినియాలో విషాద కరుణమైన సంఘట చోటు చేసుకున్నది. అక్కడ ప్రాంతంలో ఉండేటు వంటి కొండ చర్యలు విరిగిపడి దాదాపుగా ఈ ఘటన కింద రెండు వేల మంది సజీవ సమాధి అయినట్లుగా తెలుస్తోంది. ఇది ఆ దేశ నేషనల్ డిజాస్టర్ సెంటర్ గా కూడా తెలియజేశారు. ఈ సమాచారాన్ని పావువా న్యూగినియా అధికారులు వెల్లడించారు.. అందించిన వివరాల ప్రకారం..పావువా న్యూగినియాలో కొండ చర్యలు విరిగిపడడంతో ఈ ప్రమాదంలో 2000 మంది సజీవ సమాధి అయ్యారని తెలిపారు. ఈ కొండ చర్యలు విరిగిపడి సుమారుగా 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఒక బీభత్సవం సంభవించింది అంటూ తెలిపారు. దీంతో చుట్టుపక్కల ఉండే ప్రాంతాలలోనూ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు.



కొన్నిచోట్ల 8 మీటర్ల ఎత్తున శిథిలాలు కూడా కుప్పకూలిపోయినట్లు తెలియజేశారు అధికారులు.. అలాగే చాలా చోట్ల కొండ చర్యలు విరిగి పడుతూ ఉండడంతో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉందని పెద్దపెద్ద సైజులో ఉండే బండరాలు పడడంతోనే మృతుల దేహాలను వెతికి తీయడం చాలా కష్టంగా మారింది అంటూ తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రమాదం కారణంగా 2000 మంది మరణించారని.. ఐరాస ఆఫీసుకు సమాచారం వచ్చినట్లుగా తెలియజేశారు అధికారులు.


ఈరోజు ఉదయం లేఖను తమ కార్యాలయానికి కూడా పంపించారని తమ దేశానికి తగ్గ సాయం అందించాలంటూ కోరారు.. అలాగే మిత్ర దేశాలు అందించే సహాయాన్ని దిజాస్టర్ సెంటర్ ద్వారా అందిస్తామంటూ అక్కడి ప్రభుత్వం కూడా తెలియజేశారు.. అయితే ఎంగా ప్రావిన్స్  లోని ఎంబాలి గ్రామం పైన శుక్రవారం రోజున ఒకసారి మౌంట్ ముంగలాల కొండ చర్యలు విరిగిపడ్డాయట దీంతో ప్రావిన్స్ లో కూడా భారీ నష్టం వాటిల్లింది. ఈ ప్రాంతంలో ఉన్న నివాసాలు దాదాపుగా నేలమట్టమయ్యాయి అని కూడా తెలుస్తోంది. కొండ చర్యల కారణంగా ప్రజారావా నాకు సైతం తీవ్ర ఇబ్బందులు ఏర్పడినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: