కావాల్సిన ప‌దార్థాలు:
బంగాళా దుంపలు- అర‌కిలో
ఉల్లిపాయ తరుగు- ఒక క‌ప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్‌- ఒక టేబుల్ స్పూన్‌


తాలింపు దినుసులు- అరచెంచా
ఉప్పు- రుచికి తగినంత
పచ్చిమిర్చి-  నాలుగు
పసుపు- పావు చెంచా


కొత్తిమీర- కొద్దిగా
నూనె- త‌గినంత‌
కరివేపాకు- రెండు రెబ్బలు
మిరియాల పొడి- అర చెంచా


త‌యారీ విధానం: 
ముందుగా బంగాళా దుంప‌ల‌ను చెక్కు తీసి శుభ్రం చేసి పెద్ద పెద్ద ముక్కలుగా క‌ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేడి చేసి తాలింపు గింజలు, కరివేపాకు వేసి తర్వాత ఉల్లి తరుగు వేసి మగ్గే వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో పసుపు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి మరో ఐదు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత garlic PASTE' target='_blank' title='అల్లం వెల్లుల్లి పేస్ట్‌-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి కలిపి అందులో ముందుగా క‌ట్ చేసి పెట్టుకున్న బంగాళా దుంప ముక్కలు, తగినంత ఉప్పువేసి బాగా కలిపి మూత పెట్టాలి. 


ఇప్పుడు ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత కప్పుడు నీళ్లు పోసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ముక్క ఉడికిన తర్వాత మిరియాల పొడి చల్లి బాగా కలిపి రెండు నిమిషాల తర్వాత చివ‌రిలో కొత్తిమీర తరుగు కూడా చల్లి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే అదిరిపోయే ఆలూ పెప్పర్ కర్రీ రెడీ. ఈ క‌ర్రీని పూరీ లేదా చపాతీ లేదా రైస్‌తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: