వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత వరుసగా ఎన్.టి.ఆర్, రాం చరణ్, గోపి చంద్, నాగ చైతన్య వంటి స్టార్ హీరోలతో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంది. అంతేకాదు టాలీవుడ్ లో కొన్నాళ్ళు హైయ్యేస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంది కూడా. దాంటో అందరూ రకుల్ కి టాలీవుడ్ లో ఒక పదేళ్ళ పాటు ఏమాత్రం ఢోకా లేదని అనుకున్నారు. కానీ ఆ అదృష్ఠం పాపం రకుల్ కి లేకుండా పోయింది. రకుల్ కెరీర్ ఒక్కసారిగా తలకిందులైంది. మెగా హీరోలతో బ్లాక్ బస్టర్ సక్సస్ లను అందుకున్నా కూడా రకుల్ జీరో గా మారిపోయింది. వరుస ఫ్లాపుల తో టాలీవుడ్ లో తన ఇమేజ్ మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది. 

 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమాతో మొదలైన రకుల్ ఫ్లాపుల పరమర రీసెంట్ గా టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నటించిన మన్మథుడు 2 వరకూ వచ్చిన ఫ్లాప్స్ రకుల్ ని దారుణమైన పరిస్థితికి దిగజార్చాయి. దాంతో ప్రస్తుతం అమ్మడు టాలీవుడ్ వదిలి ముంబైలో చేరింది. అక్కడ అజయ్ దేవగన్, టబు లతో కలిసి దే దే ప్యార్ దే అన్న సినిమాలో నటించి హిట్ దక్కించుకుంది. ఆ ఉత్సాహంతో ఇంకా ఛాన్సులు దక్కించుకోవాలని ఏదో ఒక ఫోటోషూట్ లతో అక్కడే సెటిలైంది. అందులో భాగంగా ప్రస్తుతం రకుల్ ఒక బాలీవుడ్ సినిమా తో పాటు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమాలో నటిస్తోంది. 

 

దాంతో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్స్ తో సెక్సీగా కనిపిస్తూ సోషల్ మీడియాలో కుర్రకారుకి బాగా టచ్ లో ఉంటుంది. అంతేకాదు మళ్ళీ టాలీవుడ్, బాలీవుడ్ ల లో ఛాన్సులు దక్కించుకోవాలని మేకర్స్ ని తన హాట్ ఫొటోస్ తో గాలం వేస్తోంది. అందుకే వీలైనంత పొదుగా బట్టలు వేసుకొని కుదిరినంతగా చూపించేస్తుంది. అయితే అలా చూపిస్తున్న రకుల్ ని నెటిజన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు. తన డ్రస్సింగ్ మీద రక రకాలుగా హాట్ కామెంట్స్ చేస్తున్నాయి. అయితే ఆ కామెంట్స్ కి రకుల్ రగిలిపోతుంది. అంతేకాదు తిరిగి రివర్స్ లో హిత బోధ కూడా చేస్తుంది. మరి తమరు వేసుకునే బట్టలు అలా ఉన్నప్పుడు జనాలు కామెంట్స్ చేస్తారు కదా మాడం అంటూ మరికొందరు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: