మహీంద్రా అండ్ మహీంద్రా బొలెరో ఎస్.యు.వి స్పెషల్ ఎడిషన్ ను దీపావాళి సందర్భంగా లాంచ్ చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ప్రత్యేకమైన ఫీచర్స్ తో 2019 మహీంద్రా నుండి వస్తుంది. దీని ధర 7.68 లక్షల ఎక్స్ షో రూం ప్రైజ్ తో వస్తుంది. అత్యాధునిక టెక్నాలజీతో ఈ వెహికల్ వస్తుంది. అయితే ఇంజిన్ పరంగా రెగ్యులర్ బెలొరోకు ఈ స్పెషల్ ఎడిషన్ కు ఎలాంటి డిఫరెన్సులు లేవు.


మహీంద్రా పవర్ ప్లస్ బెలెరో ఎస్.యు.వి స్పెషల్ ఎడిషన్ లో బాడీ డీకార్స్, సీట్ కవర్స్, కార్పెట్ మ్యాట్లు, బంపర్ కు స్పెషల్ గా ఫాగ్ ల్యాంప్స్ కొత్తగా వచ్చాయి. ఈ వెహికల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టెం తో అందుబాటులో ఉంది. 1.5 లీటర్ ఎం హాక్ డి70 డీజిల్ ఇంజిన్ తో ఈ వెహికల్ వస్తుంది. 


ఇక ఈ వెహికల్ 5 స్పీడ్ మ్యన్యువల్ గేర్ బాక్స్ కలిగి ఉంది. 70 బి.హెచ్.పి, 195 ఎన్.ఎం టార్క్ తో మహీంద్ర బొలెరో పవర్ ప్లస్ వస్తుంది. 2020 లో కొత్త వర్షన్ బొలెరో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. బి.ఎస్ 6 శ్రేణితో ఈ వెహికల్ వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ కావాలనుకునే వారు ఈ స్పెషల్ ఎడిషన్ ను ఎంపిక చేసుకోవచ్చు.    


మరింత సమాచారం తెలుసుకోండి: