దివంగత నాయకుడు నాయిని నర్సింహరెడ్డి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది.... నాయిని మరణం మర్చిపోక ముందే ఆయన సతీమణి నాయిని అహల్య (68) అనారోగ్యంతో మృతి చెందారు.... నాయిని నర్సింహారెడ్డితో పాటు ఆమెకూ కరోనా సోకింది..... దివంగత నాయకుడు నాయిని నర్సింహరెడ్డి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది..... ఆయన సతీమణి నాయిని అహల్య (68) అనారోగ్యంతో మృతిచెందారు..... నాయిని నర్సింహారెడ్డితో పాటు ఆమెకూ కరోనా సోకినా విషయం మనకు తెలిసిందే..... అయితే ఆ తర్వాత అహల్యకు నెగటివ్ వచ్చినా కూడా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు......... ఈ క్రమంలో ఆమె ఈరోజు మృతిచెందారు.... నిజంగా ఇది ఆ కుటుంబానికి తీరని లోటు... తండ్రి మరణ వార్త కోలుకోక ముందే తల్లి మరణించడం నిజంగా చాల బాధాకరం...
నాయిని నర్సింహారెడ్డి సతీమణి గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు.... భర్తను కడసారి చూసేందుకు ఆమె వీల్చైర్లోనే మహాప్రస్థానానికి చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు..... భర్తను తలుచుకుంటూ ఆమె కన్నీరుమున్నీరు అయ్యారు......ఐదు రోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ మృతిచెందడంతో నాయిని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది....నాయిని సతీమణి మరణ వార్త విని తెలంగాణా సియం కెసిఆర్ సైతం షాక్ అయ్యారట..ప్రగడ సానుభూతి ప్రకటించినట్టు తెలుస్తుంది...నాయిని చనిపోయిన రోజు ఆస్పత్రిలోనే ఉన్న అహల్య... వీల్ చైర్లోనే భర్తను కడసారి చూసేందుకు వచ్చారు. ఆస్పత్రి సిబ్బంది ఆమెను ప్రత్యేక అంబులెన్సులో మినిస్టర్ క్వార్టర్స్కి తీసుకొచ్చారు.
అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆమె... నాయిని ఇక లేరన్న విషయాన్ని తట్టుకోలేకపోయారు. ఆయన భౌతిక కాయాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో కొడుకులు,కుమార్తెలు ఆమెను ఓ కాగా,గత గురువారం అర్ధరాత్రి మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూసిన సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ శ్వాస సమస్యలు తలెత్తడం, శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఆయన కన్నుమూశారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుమ ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.