పశ్చిమ గోదావరి జిల్లాలో మండ‌ల ప‌రిష‌త్‌, జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల పోలింగ్ ప్రారంభ‌మైంది. కొన్ని చోట్ల స్వ‌ల్ప ఘ‌ర్ష‌ణ‌లు మిన‌హా పోలింగ్ ప్ర‌శాంతంగా జ‌రుగుతోంది. దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. పెదపాడు మండలం వ‌ట్లూరు జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద పంచాయతీ సిబ్బంది కి, ఏఎన్ఎం సిబ్బంది కి మధ్య ఘర్షణ నెల‌కొంది. ఇక శానిటైజర్ లు లేవని అడిగిన ANM సిబ్బంది పై పంచాయతీ సిబ్బంది గొడ‌వ‌కు దిగారు. చివ‌ర‌కు పోలీసులు రంగంలోకి దిగి వీరి గొడ‌వ స‌ర్దుబాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: